అక్షరటుడే, వెబ్డెస్క్: Lok Sabha No Confidence | లోక్సభ స్పీకర్ ఓం బిర్లా (Lok Sabha Speaker Om Birla)పై అవిశ్వాస తీర్మానంపై మంగళవారం చర్చ ప్రారంభం అయింది. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు (Union Minister Kiren Rijiju) చర్చను ప్రారంభించారు. చర్చ కోసం 10 గంటలు కేటాయించారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ విపక్ష సభ్యులు కేసీ వేణుగోపాల్, అసద్ లేవనెత్తగా.. ప్యానెల్ స్పీకర్ జగదాంబిక పాల్ తిరస్కరించారు.
కాంగ్రెస్ ఎంపీ మహమూద్ జావేద్ (Congress MP Mahmood Javed) అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. చర్చ అనంతరం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) మాట్లాడనున్నారు. స్పీకర్ స్థానంలో బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ కూర్చున్నారు. చర్చకు 10 గంటలు కేటాయించినట్లు చెప్పారు. తీర్మానానికి కట్టుబడి ఉండాలని ఎంపీలను కోరారు.
Lok Sabha No Confidence | లోక్సభ గౌరవం కోసం..
కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ.. ఈ తీర్మానం ఓం బిర్లాను లక్ష్యంగా చేసుకోవడం కోసం కాదన్నారు. తాము లోక్సభ గౌరవాన్ని కాపాడాలనుకుంటున్నామని చెప్పారు. స్పీకర్ ఓంబిర్లాపై పలువురు ప్రతిపక్ష నాయకులు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. ఆయన పక్షపతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లోక్సభలో కొన్ని “ఊహించని చర్యలు” గురించి స్పీకర్ మాట్లాడినప్పుడు, కాంగ్రెస్ సభ్యులపై కొన్ని తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.
Lok Sabha No Confidence | ప్రధాని మద్దతు
ప్రతిపక్ష సభ్యులు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినప్పటి నుంచి స్పీకర్ బిర్లా సభ కార్యకలాపాల నుంచి తప్పుకున్నారు. లోక్సభ సెక్రటేరియట్ అజెండా ముగిసిన తర్వాతే తాను తిరిగి వస్తానని తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ మొహమ్మద్ జావేద్ మాట్లాడుతూ.. సభలోని అన్ని వర్గాల విశ్వాసాన్ని పొందేందుకు అవసరమైన నిష్పాక్షికతను కొనసాగించడంలో స్పీకర్ విఫలం అయ్యారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడిని, ఇతర ప్రతిపక్ష నాయకులను మాట్లాడకుండా స్పీకర్ అడ్డుకున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్ష మహిళా ఎంపీలపై అనవసర ఆరోపణలు చేశారని విమర్శించారు.
ఇది కూడా చదవండి..: LPG Booking Interval | గ్యాస్ సిలిండర్ల బుకింగ్పై కేంద్రం కీలక నిర్ణయం

