అక్షరటుడే, న్యూఢిల్లీ: LPG Price Hike | భారత్లో గృహ వినియోగదారులకు మరోసారి గ్యాస్ ధరలు షాక్ ఇచ్చాయి. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరను కేంద్ర సర్కారు పెంచింది. మార్చి 7వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా నూతన ధరలు అమల్లోకి వచ్చాయి.
కేంద్రం నిర్ణయం ప్రకారం.. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ (Domestic LPG Cylinder) ధరపై రూ.60 పెంచారు. అదే సమయంలో కమర్షియల్ సిలిండర్ ధరను రూ.115 వరకు పెంచారు. ఈ ధరల పెంపు వెంటనే అమల్లోకి వచ్చినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి.
LPG Price Hike | ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు
దేశంలోని ప్రధాన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు Indian Oil Corporation, Bharat Petroleum, Hindustan Petroleum కొత్త ధరల జాబితాను ప్రకటించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన, ముడి చమురు ధరల మార్పులు, దిగుమతి వ్యయాల పెరుగుదల తదితర అంశాల ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నాయి.
తాజా ధరల పెంపుతో గృహ వినియోగదారులపై అదనపు భారం తప్పడంలేదు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. తాజాగా గ్యాస్ ధరలు కూడా పెరగడం సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇక రెస్టారెంట్లు, హోటళ్లు, చిన్న వ్యాపారాలు ఉపయోగించే కమర్షియల్ సిలిండర్ ధర సైతం పెరగడంతో వ్యాపార రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని వ్యాపారులు వాపోతున్నారు.
LPG Price Hike | అంతర్జాతీయ మార్కెట్..
అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను బట్టి ప్రతి నెల ఆయిల్ కంపెనీలు ఎల్పీజీ ధరలను సమీక్షిస్తాయి. ఇదే ప్రక్రియలో భాగంగా తాజాగా ధరలు పెంచినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇక ఆయా నగరాల్లో స్థానిక పన్నులు, రవాణా ఖర్చుల వంటి అంశాల నేపథ్యంలో స్థానికంగా సిలిండర్ ధరలు కొద్దిగా మారవచ్చని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. కొత్త ధరలతో గృహ వినియోగదారులు, వ్యాపార సంస్థలు తమ నెలవారీ బడ్జెట్ను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

