అక్షరటుడే, వెబ్డెస్క్: Lungs Transport Operation | ఓ వ్యక్తి ఆపరేషన్ కోసం ఊపిరితిత్తులను కర్ణాటక నుంచి హైదరాబాద్ కు తీసుకువచ్చారు. దీని కోసం హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు.
ఊపిరితిత్తులు, గుండె వంటి కీలక అవయవాలు మార్పిడి చేయాలంటే.. తక్కువ సమయం ఉంటుంది. వాటిని ఆపరేషన్ చేసి తొలగించిన తర్వాత.. అవసరం అయిన వ్యక్తికి వెంటనే అమర్చాలి. లేటు అయితే ఉపయోగం ఉండదు. ఈ క్రమంలో బెంగళూరు నుంచి హైదరాబాద్కు విమానంలో ఊపిరితిత్తులను తరలించారు. సోమవారం మధ్యాహ్నం 2.20 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి (Shamshabad Airport) అవి చేరుకున్నాయి.
Lungs Transport Operation | పోలీసుల చర్యలు
హైదరాబాద్ (Hyderabad) నగరంలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుంది. దీంతో ఊపిరితిత్తులు సకాలంలో సికింద్రాబాద్లోని మినిస్టర్ రోడ్లో ఉన్న KIMS ఆసుపత్రికి చేరుకునేందుకు వీలుగా హైదరాబాద్ నగర పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు గ్రీన్ చానెల్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక అంబులెన్స్లో వైద్యులు ఊపిరితిత్తులను ఆస్పత్రికి తలించారు. ఈ మార్గంలో ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సహకరించాలని పోలీసులు కోరారు. పోలీసులు సమన్వయంతో ఎక్కడా కూడా అంబులెన్స్ ట్రాఫిక్ (Ambulance Traffic)లో చిక్కుకోకుండా ఏర్పాట్లు చేశారు. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి కిమ్స్ ఆస్పత్రికి 35 కిలోమీటర్లు 20 నిమిషాల్లోనే ఊపిరితిత్తులను తరలించారు.
ఇది కూడా చదవండి..: Basara Temple Development | బాసర ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
