అక్షరటుడే, ఇందూరు/ఎల్లారెడ్డి: Madiga Martyrs Day | మాదిగ అమరవీరుల (Madiga Martyrs) త్యాగాలు వెలకట్టలేనివని ఎంఎస్సీ జిల్లా అధ్యక్షుడు సరికెల పోశెట్టి తెలిపారు. మాదిగ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం జిల్లా కేంద్రంలోని పులాంగ్ చౌరస్తాలో అమరవీరుల చిత్రపటాలకు నివాళులర్పించారు.
Madiga Martyrs Day | మాదిగ ఉపకులాల అభివృద్ది కోసం..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదిగ ఉపకులాల అభివృద్ధి కోసం జరిగిన పోరాటంలో అనేకమంది అమరవీరులయ్యారన్నారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సుదీర్ఘ 30 ఏళ్ల ఉద్యమంలో రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ (SC Categorization) జరుగుతుందని తెలిపారు. మాదిగల కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదులుకున్న వారికి రుణపడి ఉండాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు నాగభూషణం, ఉద్యోగ నాయకులు నాంపల్లి, తెడ్డు గంగారం, మహిళా సమాఖ్య నాయకురాలు యమునా, బాబురావు, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి శ్యామ్, రమేష్, నగర అధ్యక్షుడు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Madiga Martyrs Day | ఎల్లారెడ్డి మండలంలో..
ఎల్లారెడ్డి (Yelalreddy News) మండల కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద వర్గీకరణ సాధన కోసంఅసువులు బాసిన మాదిగ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా 12 మంది వర్గీకరణ కోసం పోరాడారన్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS Movement) స్థాపించినప్పటి నుంచి మందకృష్ణ ఆదేశాల మేరకు మాదిగలు వర్గీకరణ కోసం పోరాడుతున్నారన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కంది పద్మారావు, ఎమ్మార్పీఎస్ ఎల్లారెడ్డి మండల అధ్యక్షుడు శివానంద, నాగిరెడ్డిపేట మండల అధ్యక్షులు తొంట సాయిలు, భూమేష్ తదితరులు పాల్గొన్నారు.


