అక్షరటుడే, వెబ్డెస్క్ : Maize Procurement Centers | రాష్ట్రంలో మక్క కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి హరీశ్రావు (Former Minister Harish Rao) డిమాండ్ చేశారు. మక్క రైతులు ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సిద్దిపేట జిల్లా (Siddipet District) నంగునూరు మండలం ఆరేపల్లి (అక్కెనపల్లి) గ్రామంలో సుమారు 350 ఎకరాల్లో మక్క సాగు చేస్తున్నట్లు రైతులు తెలిపారు. కొనుగోలు కేంద్రం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వారు హరీశ్రావుకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు కాంగ్రెస్ పాలనలో కష్టాలు తప్పడం లేదన్నారు.
Maize Procurement Centers | రైతు భరోసా ఎక్కడా..
షాపుల్లో ఇవ్వాల్సిన యూరియా యాపుల్లో ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించి రేవంత్రెడ్డి ప్రభుత్వం విఫలం అయిందన్నారు. పంట కోతల దశకు వచ్చినా ఇంకా రైతు భరోసా (Rythu Bharosa) ఇవ్వలేని దుస్థితి ఉందన్నారు. అసలు ప్రభుత్వం యాసంగి సీజన్కు సంబంధించి పెట్టుబడి సాయం అందిస్తుందా లేదా అని ఆయన ప్రశ్నించారు.

Maize Procurement Centers | కొనుగోళ్లలో నిర్లక్ష్యం
పండించిన పంటైన అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాల ఏర్పాటులోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని హరీశ్రావు మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో మద్దతు ధర అందక మక్క రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాల్కు రూ.300–600 తక్కువ ధరకు రైతులు అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. అనేక జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభమవడం, అసలు ఏర్పాటు చేయక పోవడంతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. వెంటనే మక్క కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి..: Telangana Summer Heat | మండుతున్న ఎండలు.. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి

