అక్షరటుడే, వెబ్డెస్క్: Maoist Leader Surrender | మావోయిస్టు పార్టీ (Maoist Party)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. కీలక నేత చెల్లూరు నారాయణరావు అలియాస్ సోమన్న ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం నారాయణరావు ఏవోబీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు.
సీనియర్ మావోయిస్టు కమాండర్ చెల్లూరు నారాయణరావు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల (Andhra Pradesh Police) ఎదుట లొంగిపోయారు. పలువురు ఇతర మావోయిస్టు కేడర్లతో పాటు ఆయన లొంగిపోవడం, ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏఓబీ) ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలకు ఒక పెద్ద ఎదురుదెబ్బ.
Maoist Leader Surrender | ఏవోబీ రాష్ట్ర కమిటీలో..
చెల్లూరు నారాయణరావు స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) వజ్రాపు కొత్తూరు మండలం, బత్తుపురం గ్రామం. ఆయన నిషేధిత సీపీఐ (మావోయిస్టు)లో ఒక సీనియర్ కార్యకర్తగా ఉంటూ, చాలా సంవత్సరాలుగా అనేక కీలక పదవులను నిర్వహించారు. సోమన్న అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఆయన, ఏఓబీ రాష్ట్ర కమిటీలో సభ్యుడిగా పనిచేశారు. నారాయణరావుతోపాటు ఏఓబీ స్పెషల్ జోనల్, ఏరియా, డివిజనల్ కమిటీలతో సహా వివిధ కమిటీలకు చెందిన ఇతర మావోయిస్టులు సరెండర్ అయ్యారు.
Maoist Leader Surrender | రేపటితో ముగియనున్న గడువు
దేశంలో మార్చి 31 నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆపరేషన్ కగార్ (Operation Kagar) చేపట్టింది. దీంతో వందలాది మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో చనిపోయారు. కీలక నేతలు సైతం హతం అయ్యారు. అలాగే వేలాది మంది ఆయుధాలు వీడి పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. పార్టీ సెక్రెటరీ దేవ్జీ సైతం లొంగిపోయారు. దీంతో మావోయిస్ట్ ఉద్యమం దాదాపు ముగిసిపోయినట్లే అనే చర్చ జరుగుతోంది. అయితే అక్కడక్కడ అడవుల్లో ఇంకా నక్సల్స్ ఉన్నారు. ఈ క్రమంలో రేపటితో కేంద్రం విధించిన గడువు ముగియనుంది. అప్పటిలోగా మొత్తం మావోయిస్టులు లొంగిపోతారా.. లేదా అనేది చూడాలి.
ఇది కూడా చదవండి..: AI Toll Collection | ఏఐతో సర్కారుకు కాసుల పంట.. నాలుగింతలు కానున్న టోల్ వసూళ్లు
