అక్షరటుడే, వెబ్డెస్క్ : Maoists surrender Telangana | తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిందని డీజీపీ శివధర్రెడ్డి (DGP Shivadhar Reddy) అన్నారు. ఆయన ఎదుట శుక్రవారం 42 మంది మావోయిస్టులు లొంగిపోయారు. పూర్తిస్థాయిలో PLGA కనుమరుగైందని డీజీపీ తెలిపారు.
లొంగిపోయిన వారిలో పీఎల్జీఏ బెటాలియన్ డిప్యూటీ కమాండర్ సోడి కేశలు అలియాస్ కేశతో సహా 42 మంది మావోయిస్టులు ఉన్నారు. 36 ఆయుధాలతో వారు సరెండర్ అయ్యారు. ఇందులో 5 AK–47, 4 SLR, 3 INSAS రైఫిల్స్, 6 BGL గన్స్, 1 పిస్టల్, 2 రివాల్వర్లు ఉన్నాయి. వారు 800 గ్రాముల బంగారాన్ని సైతం పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన వారి జాబితాలో పీఎల్జీఏ బెటాలియన్కు చెందిన ఒక శిక్షణ పొందిన వైద్యుడు కూడా ఉన్నారు.
Maoists surrender Telangana | గర్వంగా ప్రకటిస్తున్నా..
డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ… ఈ భారీ లొంగుబాటుతో రాష్ట్రంలో పీఎల్జీఏ బెటాలియన్ (PLGA Battalion) పూర్తిస్థాయిలో కనుమరుగైందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో క్రియాశీలక మావోయిస్టు కేడర్ ఎవరూ లేరని తెలిపారు. దీంతో రాష్ట్రం మావోయిస్టు రహితంగా అవతరించిందని గర్వంగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాగా ప్రస్తుతం లొంగిపోయిన సోడి కేశాలు తెలంగాణ-ఛత్తీస్గఢ్ (Telangana-Chhattisgarh) సరిహద్దు వెంబడి పనిచేస్తున్న పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీజీఎల్ఏ) బెటాలియన్కు డిప్యూటీ కమాండర్గా కీలక పాత్ర పోషించాడు. కర్రెగుట్ట (Karregutta)ల్లో మావోయిస్టు కేడర్లకు నాయకత్వం వహించాడు. బర్స దేవా లొంగిపోయిన తర్వాత బెటాలియన్ బాధ్యతలు స్వీకరించాడు.
ఇది కూడా చదవండి..: CV Anand DGP | కొత్త డీజీపీగా సీవీ ఆనంద్!
