అక్షరటుడే, వెబ్డెస్క్: Markapuram Bus Accident | మార్కాపురం బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కనిగిరికి వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు ఏపీలోని మార్కాపురం జిల్లా (Markapuram District) రాయవరం సమీపంలో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ట్రావెల్స్ బస్సు, కంకర లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సులో మంటలు వ్యాపించడంతో 13 మంది చనిపోయారు.
ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. ఒంగోలు ఎస్పీ హర్షవర్దన్ రాజు (Ongole SP Harshavardhan Raju) ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. 13 మంది మృతదేహాలు వెలికి తీశామని చెప్పారు. తీవ్ర గాయాలపాలైన 23 మందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామన్నారు. ఒకరిద్దరికి ఫ్రాక్చర్ తప్ప మిగతావారి పరిస్థితి నిలకడగానే ఉందన్నారు.
Markapuram Bus Accident | సీఎం దిగ్భ్రాంతి
మార్కాపురం బస్సు ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు ప్రయాణికులు మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి తగిన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు ఆంధ్రప్రదేశ్ సీఎస్తో మాట్లాడారు.
Markapuram Bus Accident | పవన్ కల్యాణ్ విచారం
బస్సు ప్రమాద ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికిగల కారణాలపై జిల్లా అధికారులను ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు.
ఇది కూడా చదవండి..: Markapuram Bus Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సులో చెలరేగిన మంటలు.. 10 మంది సజీవ దహనం..

