అక్షరటుడే, వెబ్డెస్క్ : Market Recovery Bonus Fake | ‘బిగ్ బ్రేకింగ్ న్యూస్. ప్రతి డీమాట్ ఖాతాకు రూ. 10 వేల ‘మార్కెట్ రికవరీ బోనస్’ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఈరోజు ఉదయం నుంచి ఆటోమేటిక్గా క్రెడిట్ అవుతుంది’ అంటూ సోషల్ మీడియా (Social Media)లో ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఎక్స్ లలో ఇలాంటి పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. దీంతో తమకు నిజంగానే రూ. 10 వేల బోనస్ వస్తుందేమోనని పలువురు ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు.
Market Recovery Bonus Fake | వాస్తవ దూరం..
మార్కెట్ రికవరీ (Market Recovery) బోనస్ విషయంలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ఇది ఫేక్ న్యూస్ మాత్రమే. మార్కెట్ రికవరీ బోనస్ విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గాని, సెబీ, ఎన్ ఎస్ డీఎల్ (NSDL), సీఎస్ డీఎల్ గాని ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇలాంటి ప్రకటనలను నమ్మకపోవడమే ఉత్తమం. ఎందుకంటే మన దేశంలో కోట్లాది డీమాట్ ఖాతాలున్నాయి. వారందరికీ రూ. 10 వేల చొప్పున మార్కెట్ రికవరీ బోనస్ ఇవ్వడం అనేది అసాధ్యం. ఇలా ఇవ్వడంలో ఎలాంటి లాజిక్ కూడా లేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఇలాంటి ప్రచారం నమ్మశక్యంగా లేదు. ఇలాంటి మెస్సేజ్లను షేర్ చేయకపోవడమే ఉత్తమం.
Market Recovery Bonus Fake | మోసగాళ్లకు అవకాశం..
ఇలాంటి ప్రకటనలను నమ్మితే సైబర్ మోసగాళ్ల (Cyber Frauds)బారిన పడి నష్టపోయే ప్రమాదాలు ఉంటాయి. ‘మార్కెట్ రికవరీ బోనస్’ను ఆసరా చేసుకుని సైబర్ నేరగాళ్లు లింక్లు పంపి, ఖాతాలు లూటీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఉచితంగా డబ్బు ఇస్తుంది అన్న ప్రకటనల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సందేహం తలెత్తితే నేరుగా అధికారిక వెబ్సైట్లలో చెక్ చేసుకోవాలి. అంతేకాని ఎలాంటి లింక్ లపైనా క్లిక్ చేయవద్దు. డీమాట్ లాగిన్ వివరాలు, పాన్, ఆధార్ వివరాలను ఎవరికీ ఇవ్వవద్దు.
ఇది కూడా చదవండి..: India census 2027 | నేటి నుంచి దేశవ్యాప్తంగా జనగణన.. వారికి కుటుంబ హోదా!
