అక్షరటుడే, వెబ్డెస్క్ : Meeseva service charges hike | తెలంగాణ మీ సేవ కేంద్రాల్లో సర్వీసు ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని సర్వీసులపై సుమారు 50 శాతం ధరల పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి మీ సేవ కేంద్రాల సేవలపై కొత్త చార్జీలు అమలులోకి వచ్చాయి. కేంద్రాల నిర్వహణ ఖర్చులు పెరగడం, నిర్వాహకుల విజ్ఞప్తుల మేరకు ధరలను పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. తాజా జీవో ప్రకారం పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి రానున్నాయి. ఇన్కం సర్టిఫికెట్ (Income Certificate) కోసం గతంలో రూ.45నుంచి రూ.55 వరకు వసూలు చేసేవారు. తాజాగా దానిని రూ.80కు పెంచారు. కాస్ట్ సర్టిఫికెట్ కోసం రూ.45 నుంచి 55 ఉండగా.. దానిని కూడా రూ.80కి పెంచారు.
Meeseva service charges hike | విద్యార్థులపై భారం
రెసిడెన్సీ సర్టిఫికెట్ రూ.45 నుంచి రూ.80కి, జనన ధ్రువీకరణ పత్రం ప్రింట్ (Birth) గతంలో రూ.40 ఉండగా.. రూ.62కు పెంచారు. తాజా భారంతో పెరిగిన భారంతో విద్యార్థులు, ప్రజలపై భారం పడనుంది. ఇన్కం, క్యాస్ట్, రెసిడెన్సీ సర్టిఫికెట్లు విద్యార్థులకు ఎంతో అవసరం. దీంతో వారిపై అదనపు భారం పడనుంది. మరోవైపు ఇప్పటికే పలు మీ సేవ కేంద్రాల్లో అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. తాజా పెంపుతో మరింత భారం పడనుంది.
దీనిని కూడా చదవండి : Ration Card Removal | రేషన్కార్డులు తొలగించే కుట్ర.. కవిత సంచలన వ్యాఖ్యలు
