అక్షరటుడే, వెబ్డెస్క్ : Midwifery Training | ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో మిడ్వైఫరీ ట్రైనింగ్ త్వరలో ప్రారంభిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Rajanarsihma) అన్నారు. సిజేరియన్ డెలివరీలను తగ్గించి.. నార్మల్ డెలివరీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
బోయగూడలోని మిడ్వైఫరీ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (Midwifery Training Institute)లో జరిగిన సేఫ్ మదర్ హుడ్ డే వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో నర్సింగ్ ఆఫీసర్ల నియామకానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. రెండేళ్లలో 10 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేశామని వెల్లడించారు. ఇందులో నర్సింగ్ పోస్టులే అధికంగా ఉన్నాయన్నారు. రెండు మూడు రోజుల్లో మరో 2,322 నర్సింగ్ పోస్టుల భర్తీ పూర్తవుతుందని పేర్కొన్నారు. కొత్త నర్సింగ్ కాలేజీలు స్థాపించి, విద్యార్థులకు అవకాశాలు పెంచుతున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాల కోసం నర్సింగ్ స్టూడెంట్స్కు ఇంగ్లీష్, జర్మన్, జపనీస్ భాషల్లో శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు.
Midwifery Training | ఉచితంగా పరీక్షలు
గర్భిణులకు ప్రభుత్వ హాస్పిటళ్లలో సమగ్ర వైద్య సేవలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఉచితంగా యాంటీనేటల్ చెకప్లు, స్కానింగ్లు, అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. హైరిస్క్ గర్భిణులను ముందుగానే గుర్తించి, ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు.
Midwifery Training | ఆరోగ్య మహిళ కార్యక్రమం
ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక సేవలు అందిస్తున్నట్లు మంత్రి రాజనర్సింహ తెలిపారు. 46 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉచితంగా 30 రకాల వైద్య పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. సర్వైకల్ కేన్సర్ను అరికట్టేందుకు బాలికలకు HPV వ్యాక్సినేషన్ చేపట్టామన్నారు. సహజ ప్రసవాలను ప్రోత్సహించేందుకు మిడ్వైఫరీ సేవలను రాష్ట్రంలో బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. 370 మంది నర్సులకు మిడ్ వైఫరీ ట్రైనింగ్ పూర్తయిందని తెలిపారు.
ఇది కూడా చదవండి : Teachers Caught by ACB | ఏసీబీకి చిక్కిన ఎంఈవో, ఉపాధ్యాయుడు
