అక్షరటుడే, వెబ్డెస్క్: MLA Disqualification Petitions | ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) శుక్రవారం విచారణ చేపట్టారు. దానం నాగేందర్ తరఫున న్యాయవాదులు విచారణకు హాజరు అయ్యారు. ఆయనపై వేటు వేయాలని బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
MLA Disqualification Petitionsసాగుతున్న విచారణ
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLA) పార్టీ మారిన విషయం తెలిసిందే. వారిపై వేటు వేయాలని బీఆర్ఎస్ స్పీకర్ను కోరింది. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఆ గడువు అక్టోబర్ 31తో ముగిసింది. అయినా కూడా విచారణ ఇంకా కొనసాగుతోంది.

MLA Disqualification Petitions | మార్చి 2కు వాయిదా..
మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ అనర్హత పిటిషన్లు వేసింది. అయితే ఇందులో 8 మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. సాంకేతిక కారణాల ఆధారంగా వారు బీఆర్ఎస్లోను ఉన్నట్లు స్పీకర్ తీర్పు చెప్పారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender), స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిటిషన్లపై తీర్పు పెండింగ్లో ఉంది. తాజాగా దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై స్పీకర్ విచారణ చేపట్టారు. ఆయనపై ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్లు వేశారు. అయితే దానం తరఫున అడ్వకేట్లు అఫిడవిట్ దాఖలు చేయలేదని బీఆర్ఎస్, బీజేపీ అడ్వకేట్లు చెప్పారు. దీంతో స్పీకర్ తదుపరి విచారణను మార్చి 2కు వాయిదా వేశారు.
ఇది కూడా చదవండి..: Employee Pending Bills Release | ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. పెండింగ్ బిల్లుల విడుదల

