అక్షరటుడే, కామారెడ్డి: Modi Revanth Reddy Criticism | ప్రజలను మభ్యపెట్టేలా తప్పుడు వాగ్దానాలతో ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య (Former MLA Gummadi Narsaiah) విమర్శించారు. పట్టణంలోని వీక్లి మార్కెట్లో మంగళవారం అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రథమ రాష్ట్ర మహాసభల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.
Modi Revanth Reddy Criticism | ప్రజలు సహకరించాలి..
ఈ సందర్భంగా గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ.. వ్యవసాయ కార్మిక సంఘం చేపడుతున్న కార్యక్రమాలు, ఉద్యమానికి ప్రజలు సహకరించాలన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హామీ ఇచ్చిన ఆరు వాగ్దానాలను పక్కన పెట్టి కాలం వెల్లదీస్తున్నారని ఆరోపించారు. ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏది చెబితే అది ప్రధాని మోదీ (Prime Minister Modi) చేస్తున్నారంటూ విమర్శించారు.
ప్రజలు రోజు కూలి చేసుకుంటూ 100 రోజులు ఉన్న ఉపాధి హామీ కార్యక్రమాన్ని 200 రోజులకు పెంచాలని డిమాండ్ చేస్తుంటే ఉన్న పథకానికి పేరు మార్చి పని లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. భారత ప్రజలను పాలించే అర్హత మోదీకి లేదని సీపీఐఎంఎల్ మాస్లైన్ భావిస్తుందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘానికి పార్టీ వెన్నుదన్నుగా ఉందని, వ్యవస్థలో మార్పు కోసం ఈ సంఘం పని చేస్తుందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Bodhan Government Hospital | బోధన్ ఆస్పత్రిలో సదుపాయల మెరుగుదలకు కృషి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

