అక్షరటుడే, కామారెడ్డి: Mohan Reddy Funeral | తూప్రాన్ సమీపంలోని మాసాయిపేట వద్ద రోడ్డు ప్రమాదంలో రామారెడ్డి మాజీ జడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతదేహానికి బుధవారం పోస్టుమార్టం పూర్తికాగా కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు.
Mohan Reddy Funeral | కాంగ్రెస్కు వెన్నుదన్నుగా ఉన్న నాయకుడు..
కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి వెన్నుదన్నుగా ఉన్న నాయకుడు కోల్పోవడంతో ముఖ్య నాయకులు కన్నీరు పెట్టుకున్నారు. మోహన్ రెడ్డి ఇంటివద్ద ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(Shabbir Ali), ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజు (Kasula Balaraj) మోహన్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంత్యక్రియల్లో పాల్గొని మోహన్ రెడ్డి పాడెను మోశారు. అంత్యక్రియలకు రామారెడ్డి మండల ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు.
ఇది కూడా చదవండి..: Couple Theft Arrest | స్క్రాప్ కొంటామని ఒకరు.. బాటిళ్లు ఏరుకుంటూ మరొకరు.. భార్యాభర్తల వరుస చోరీలు

