అక్షరటుడే, హైదరాబాద్: Moinabad Drugs Party | డ్రగ్స్ పార్టీలకు తెలంగాణ నిలయంగా మారుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధానితోపాటు శివారు ప్రాంతాల్లో తరచూ డ్రగ్స్ కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. డ్రగ్స్ సరఫరా, వినియోగంలో ప్రజాప్రతినిధుల పాత్ర ఉండటంపై రాష్ట్ర ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ శివార్లలో మరోసారి డ్రగ్స్ పార్టీ Drugs Partyకలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్నగర్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్హౌస్లో డ్రగ్స్, మద్యం పార్టీ జరుగుతుందన్న సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి పార్టీని భగ్నం చేశారు. ఈ దాడిలో కాల్పుల ఘటన కూడా చోటుచేసుకోవడం సంచలనంగా మారింది.
ఇంటెలిజెన్స్ సమాచారంతో శనివారం రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో తెలంగాణ ఈగల్ టీమ్, ఎస్వోటీ (స్పెషల్ ఆపరేషన్స్ టీమ్), స్థానిక పోలీసులు కలిసి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి పర్యవేక్షణలో ఫామ్హౌస్పై దాడి చేశారు. పోలీసులు అక్కడికి చేరుకునే సరికి ఫామ్హౌస్లో పార్టీ కొనసాగుతుండగా.. అక్కడ ఉన్నవారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.
Moinabad Drugs Party | కాల్పుల కలకలం…
ఈ సమయంలో ఢిల్లీకి delhi చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిద్ మిశ్రా ఆందోళనకు గురై పోలీసులపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్టు సమాచారం. కొన్ని నివేదికల ప్రకారం అతను గాలిలోకి కాల్పులు జరిపాడని చెబుతుండగా, మరికొన్ని నివేదికలు మాత్రం పోలీసులపై కాల్పులు జరిగాయని పేర్కొంటున్నాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.
పోలీసులు వెంటనే నమిద్ మిశ్రాను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో ఆ తుపాకీ పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డికి చెందినదిగా గుర్తించారు. తుపాకీతో పాటు బుల్లెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో ఫామ్హౌస్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Moinabad Drugs Party | ఐదుగురికి పాజిటివ్!
పోలీసులు మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఢిల్లీ వ్యాపారి నమిద్ మిశ్రా, రితేష్ రెడ్డి (రోహిత్ రెడ్డి సోదరుడు), ఎం. రమేష్, శ్రవణ్ కుమార్, నల్లపునేని విజయకృష్ణ, కాసిక్ రవి, అర్జున్ రెడ్డి, ఒక మహిళ ఉన్నారు. అదుపులోకి తీసుకున్న వారందరికీ పోలీసులు డ్రగ్ పరీక్షలు నిర్వహించారు.
ఇందులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు Mahesh Kumarడ్రగ్ టెస్ట్లో నెగెటివ్ వచ్చినట్లు తెలిసింది. అయితే మరో ఐదుగురికి మాత్రం డ్రగ్స్ వినియోగించినట్టు పాజిటివ్ ఫలితాలు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Moinabad Drugs Party | ఓ వైపు చర్యలు.. మరోవైపు ఇలా..
ఈ ఘటన తెలంగాణలో డ్రగ్స్ సులభంగా అందుబాటులోకి వస్తున్నాయన్న చర్చను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చుతామని ప్రకటిస్తున్నప్పటికీ, ఫామ్హౌస్ పార్టీల్లో డ్రగ్స్, విదేశీ మద్యం బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.
ముఖ్యంగా రాజకీయ నేతలు, సెలబ్రిటీలు సంబంధం ఉన్న పార్టీల్లో ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తుండటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ మీడియాకు వెల్లడించినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Moinabad Farmhouse Drugs Party | మొయినాబాద్ ఫామ్హౌస్లో కాల్పులు.. పోలీసులపై డ్రగ్గర్స్ దాడి!

