అక్షరటుడే, వెబ్డెస్క్ : Mojtaba Khamenei Injured | అమెరికా సంచలన ప్రకటన చేసింది. తమ దాడుల్లో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని, గుర్తు పట్టలేనట్లుగా మారిపోయారని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సేత్ (Pete Hegseth) ప్రకటించారు.
ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్ల ఖమేనీ ఇజ్రాయెల్ (Israel), అమెరికా (America) దాడుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన రెండో కుమారుడు మోజ్తాబా ఖమేనీ సుప్రీం లీడర్గా ఎన్నికయ్యాడు. ఇజ్రాయెల్, అమెరికాలపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇటీవల ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన గాయపడ్డారని అమెరిక చెబుతుండటం గమనార్హం.
Mojtaba Khamenei Injured | అజ్ఞాతంలోకి..
అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ నాయకత్వం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని కూడా ఆయన అన్నారు. మోజ్తాబా ఖమేనీ కోమాలో ఉన్నారని, వైమానిక దాడిలో తీవ్రంగా గాయపడిన తర్వాత కనీసం ఒక కాలును కోల్పోయారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా సైతం ఈ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ పరారీలో ఉన్నారని యూఎస్ రక్షణ కార్యదర్శి పేర్కొన్నారు. ఇరాన్ వద్ద చాలా కెమెరాలు, వాయిస్ రికార్డర్లు ఉన్నాయని, అయినా ఆయన రాతపూర్వక ప్రకటన మాత్రమే ఎందుకు విడుదల చేశారని ప్రశ్నించారు. కాగా సుప్రీం లీడర్పై (Mojtaba Khamenei Injured) దాడి విషయాన్ని ఇరాన్ ఇంకా ధ్రువీకరించలేదు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. దాడులు, ప్రతిదాడులతో ఇరాన్, ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలు అట్టుడుకుతున్నాయి. దీని ప్రభావం ప్రపంచ దేశాలపై పడింది. యుద్ధం ముగియాలని అనేక దేశాలు కోరుకుంటున్నాయి. హార్ముజ్ జలసంధి మూసివేతతో ముడి చమురు, గ్యాస్, ఇతర సరుకు రవాణా నిలిచిపోయింది. అయితే ఇరాన్ పలు దేశాలు నౌకలను హార్ముజ్ నుంచి పంపడానికి అనుమతిస్తోంది. యుద్ధ భయాలతో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతుండగా.. స్టాక్ మార్కెట్లు క్రాష్ అవుతున్నాయి.
దీనిని కూడా చదవండి : Israel Iran Warning | ఇరాన్ కొత్త సుప్రీం లీడర్కు ఇజ్రాయల్ వార్నింగ్..

