అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Mopal Police Inspection | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని (Nizamabad Police) మోపాల్ పోలీస్ స్టేషన్ను సీపీ సాయిచైతన్య ఆకస్మికంగా (CP Sai Chaitanya) తనిఖీ (Police Inspection News) చేశారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆయన స్టేషన్లో సిబ్బంది పనితీరును సమీక్షించారు.
Mopal Police Inspection | ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి..
ఈ సందర్భంగా సీపీ సాయి చైతన్య మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలతో సిబ్బంది స్నేహపూర్వకంగా (Law and Order)వ్యవహరించాలన్నారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. శాంతి భద్రతల విషయంలో (Telangana Police) నిక్కచ్చిగా ఉండాలని, ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా సిబ్బంది పనితీరు కనబర్చాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డుల నిర్వహణ, ఫిర్యాదుల పరిష్కారం, భద్రత చర్యలు, సిబ్బంది పనితీరుపై ఆయన మాట్లాడారు.
పోలీస్ స్టేషన్లో వాహనాల తనిఖీ..
పోలీస్ స్టేషన్కు సంబంధించిన బొలెరో, పెట్రోల్ పెట్రోలింగ్ వాహనాల పనితీరును(Police Station Review) సీపీ ప్రత్యక్షంగా పరిశీలించారు. పెట్రోలింగ్ వాహనంలో ఫస్ట్ ఎయిడ్ కిట్, ఇతర సామగ్రి ఉన్నాయా లేవా అని చూశారు. ఎల్లప్పుడూ వాహనాలను కండిషన్లో ఉంచుకోవాలని అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించే విధంగా వాహనాలను సిద్ధం చేసుకోవాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ సౌత్ రూరల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్, ఎస్సై సుశ్మిత, పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Telangana Pension Scheme | కొత్తగా రెండు లక్షల మందికి పింఛన్లు.. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

