అక్షరటుడే, కామారెడ్డి: Mudhiraj Leaders Felicitation | కామారెడ్డి, నిజామాబాద్ పట్టణాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పని చేస్తామని నిజామాబాద్ నగర కార్పొరేషన్(Nizamabad) మేయర్ ఉమారాణి, కామారెడ్డి మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి తెలిపారు. ఆదివారం మేయర్, ఛైర్పర్సన్లతో పాటు ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన ముదిరాజ్(Mudhiraj Community) కౌన్సిలర్లకు కామారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం, ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో (Community Felicitation) సన్మానం చేశారు.
Mudhiraj Leaders Felicitation | గౌరవంగా పిలిచి సన్మానించినందుకు..
ఈ సందర్భంగా ముదిరాజ్ల సమస్యల(Municipal Elections) పరిష్కారానికి ఛైర్ పర్సన్, మేయర్ కృషి చేయాలని సంఘం ప్రతినిధులు కోరారు. మేయర్ ఉమారాణి మాట్లాడుతూ.. తనను ఇంత గౌరవంగా కామారెడ్డికి (Telangana News) పిలిచి సన్మానించిన ముదిరాజ్ సంఘం (Kamareddy News) ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఛైర్పర్సన్ ఉమారాణి మాట్లాడుతూ.. ఇద్దరం ఉమారాణులం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నామని, ఇద్దరం కూడా ముదిరాజ్ సామాజికవర్గంలో ఉండటం, ఇద్దరం కూడా గెలుపొందడంతో పాటు ఇద్దరి పేర్లు ఒకటే కావడం యాదృచ్చికంగా జరిగిందన్నారు. తాను సాధారణ గృహిణి నుంచి ఈ స్థాయికి రావడానికి తన భర్త శ్రీనివాస్ కారణమన్నారు. తనపై నమ్మకంతో చైర్ పర్సన్ బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతూ వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ముందుకు సాగుతానన్నారు.
Mudhiraj Leaders Felicitation | కార్యక్రమంలో..
ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ ఛైర్మన్ పున్న రాజేశ్వర్, మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల నీలకంఠం, జిల్లా అధ్యక్షుడు విఠల్, రాష్ట్ర ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు విజయానంద్ భూపాల్, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు కాళ్ల గంగారాం, ఉపాధ్యక్షుడు చిట్యాల రమేష్, మున్సిపల్ కౌన్సిలర్లు, ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.


