అక్షరటుడే, వెబ్డెస్క్: Multigrain Atta | మారుతున్న జీవనశైలిలో ఆరోగ్య పరిరక్షణ కోసం చాలా మంది సాధారణ గోధుమ పిండిని పక్కన పెట్టి, రకరకాల ధాన్యాల మిశ్రమంతో కూడిన ‘మల్టీగ్రెయిన్ అట్టా’ (Multigrain Atta) వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రకటనల్లో చూపించినట్లుగా ఇది అందరికీ మేలు చేస్తుందని భావించడం పొరపాటే. ఇందులో పోషకాలు, పీచు పదార్థం ఎక్కువగా ఉన్నప్పటికీ, కొన్ని రకాల శరీర తత్వాలకు ఇది అస్సలు పడదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొన్ని ప్రత్యేక అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ పిండిని వాడే ముందు అప్రమత్తంగా ఉండాలి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
Multigrain Atta | వీరు మల్టీగ్రెయిన్ పిండికి దూరంగా ఉండటమే మేలు:
జీర్ణశక్తి బలహీనంగా ఉన్నవారు: ఈ పిండిలో పీచు పదార్థం (ఫైబర్) అధికంగా ఉండటం వల్ల జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం లేదా ఐబీఎస్ (IBS) వంటి సమస్యలతో బాధపడేవారు దీనిని తీసుకుంటే జీర్ణక్రియ మందగించి, కడుపులో అసౌకర్యం , మలబద్ధకం ఏర్పడే అవకాశం ఉంది.
Multigrain Atta | కిడ్నీ సమస్యలు ఉన్న వారు:
మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు పొటాషియం , ఫాస్పరస్ తక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. మల్టీగ్రెయిన్ పిండిలో ఉండే వివిధ రకాల చిరుధాన్యాల వల్ల ఈ మూలకాల శాతం పెరుగుతుంది. ఇది కిడ్నీలపై అదనపు భారాన్ని పెంచి, సమస్యను మరింత క్లిష్టతరం చేస్తుంది.
థైరాయిడ్ బాధితులు: మార్కెట్లో లభించే చాలా మల్టీగ్రెయిన్ మిశ్రమాలలో సోయాబీన్ పిండిని కలుపుతుంటారు. సోయాలోని కొన్ని పదార్థాలు థైరాయిడ్ మందుల పనితీరును అడ్డుకుంటాయి. కాబట్టి, థైరాయిడ్ ఉన్నవారు సోయా లేని పిండిని వాడటం లేదా నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.
అలర్జీ ఉన్నవారు: ప్యాక్ చేసిన పిండిలో ఏ ధాన్యాలు ఏ మోతాదులో ఉన్నాయో స్పష్టంగా తెలియదు. గ్లూటెన్ పడని వారు లేదా కొన్ని రకాల గింజల పట్ల అలర్జీ ఉన్నవారు దీనిని వాడటం వల్ల చర్మంపై దద్దుర్లు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు.
ఇది కూడా చదవండి: Sleep Fatigue Causes | కంటి నిండా నిద్రపోయినా అలసటగా అనిపిస్తోందా.. అయితే ఈ సమస్యలు ఉన్నట్టే!

