అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Municipal Workers Protest | మున్సిపల్ కార్మికులపై అధికారుల వేధింపులను నివారించాలని, అక్రమ కేసులు ఎత్తివేయాలని తక్షణమే వేతనాలు చెల్లించాలని టీయూసీఐ, సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ (Collectorate) ఎదుట కార్మికులు ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
Municipal Workers Protest | మున్సిపల్ కార్పొరేషన్లో..
ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో (Nizamabad Municipal Corporation) పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులపై అధికారుల వేధింపులను అరికట్టాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అడిగితే కేసులు పెట్టడం సరికాదన్నారు. వెంటనే ఈ అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
Municipal Workers Protest | సీఐజీ గ్రూప్లకు వేతనాలు నిల్..
కాంట్రాక్ట్ ఏజెన్సీ కార్మికులకు వేతనాలు ఇచ్చి, సీఐజీ గ్రూప్ల కార్మికులకు ఇవ్వకపోవడం అధికారుల కక్షపూరిత వైఖరికి నిదర్శనమన్నారు. మున్సిపల్ కార్మికులకు రేపటిలోగా వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ఉన్న సీఐజీ గ్రూప్లను కొనసాగిస్తూ, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కార్మికులను గ్రూప్లుగా చేయాలన్నారు. ఔట్ సోర్సింగ్ కార్మికులందరికీ యూనిఫామ్, సబ్బులు, నూనెలు, రక్షణ పరికరాలు ఇవ్వాలన్నారు. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.26వేలు ఇవ్వాలన్నారు.సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్ బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, నాయకులు కిరణ్, రవి, యాదమ్మ, శాంతికుమార్, విజయ్, గంగాధర్, లక్ష్మి, శైలజ, నవీన్, నరేష్, రాము, మహిపాల్, సహదేవ్, వినోద, మాధవి, సాయిలు, వినోద్, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Kotagiri Society Corruption | కోటగిరి గీత పారిశ్రామిక సహకార సంఘంలో అవినీతి..

