అక్షరటుడే, ఇందూరు: Munnuru Kapu Unity | మున్నూరు కాపు కులస్థులంతా ఐక్యంగా ఉండి అభివృద్ధి కోసం పాటుపడాలని మాజీ మేయర్, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ (Dharmapuri Sanjay) అన్నారు. నూతనంగా ఎన్నికైన మున్నూరు కాపు (Munnuru Kapu Association) కార్పొరేటర్లు, కౌన్సిలర్లను జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సన్మానించారు.
Munnuru Kapu Unity | కులస్థులంగా ఏకతాటిపైకి..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులస్తులందరూ (Nizamabad News) ఒక తాటిపైకి వచ్చి ఒకరినొకరు సహాయ సహకారాలు అందించుకోవడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అన్నారు. కొందరు కులాన్ని మనుషులను విభజించాలని చూస్తున్నారని, కానీ తాము మాత్రం డీఎస్ అడుగుజాడల్లో అందరినీ కలుపుకొని పోవాలనే చూస్తున్నామన్నారు. కొందరి నాయకుల స్వార్థ రాజకీయాలకు అమాయకులు బలవుతున్నారన్నారు.
Munnuru Kapu Unity | ఖాళీ కుర్చీలకు సన్మానం..
సన్మాన కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీకి (Telangana BJP) చెందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో వారికి కేటాయించిన కుర్చీలకు సన్మానించారు. రాజకీయాలకతీతంగా (Telangana Politics) మున్నూరు కాపు కులస్థులందరినీ కలుపుకొని పోవాలనేది తమ ఉద్దేశమని సంజయ్ పేర్కొన్నారు. కానీ కొందరు తమ మధ్య చిచ్చు పెట్టడం సమంజసం కాదన్నారు. కార్యక్రమానికి రావాలని ఉన్న కొన్ని అరాచక శక్తుల వల్ల రాలేకపోయారన్నారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.


ఇది కూడా చదవండి: Partial Lunar Eclipse | చంద్రగ్రహణం.. పాక్షికమే!

