అక్షరటుడే, ఎల్లారెడ్డి: Nagi Reddy Pet Congress | నాగిరెడ్డిపేట మండలంలోని (Nagireddy pet) ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసేవిధంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ (Mla Madan Mohan) ప్రణాళికలు రచిస్తున్నారు. ఈక్రమంలో నూతనంగా గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులను (village presidents appointment) నియమించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన గ్రామ అధ్యక్షులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు.
Nagi Reddy Pet Congress | నూతన కమిటీలు..
గ్రామ పూర్వ అధ్యక్షుల పదవీకాలం ముగియడంతో నూతన జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) ఏర్పాటుతో పాటు కాంగ్రెస్ పార్టీ (Telangana Congress updates) మండల అధ్యక్షుల సూచనల మేరకు ఈ నియామకాలు (political appointments) చేపట్టినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. గత కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు పార్టీ అభివృద్ధికి, ప్రజా సేవకు చేసిన కృషిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. వారి సేవలను కొనియాడుతూ, త్వరలోనే (Congress party Telangana) వారికి జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC)లో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. గ్రామ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను మరింత చురుకుగా నిర్వహించడంతో పాటు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే బాధ్యతలను కొత్త అధ్యక్షులు సమర్థవంతంగా పనిచేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అలాగే.. ప్రజాసమస్యలను గుర్తించి పరిష్కారదిశగా కృషి చేయాలని సూచించారు.
Nagi Reddy Pet Congress | కొత్త గ్రామ అధ్యక్షులు వీరే..
గోపాల్పేట్కు సూరపల్లి రాజు, నాగిరెడ్డిపేటకు బోయిని హన్మాండ్లు, గోలి లింగాలకు దాకన్నగారి మోహనరెడ్డి, (local political news) పల్లెబోగుడు తండాకు హరి నాయక్, జప్తి జానకంపల్లి ఎరుమళ్ల రాజయ్య, వాడి గ్రామానికి పుట్టి నర్సింలు, అచ్చాయిపల్లి జంగం రజనీకాంత్, రామక్కపల్లికి కట్ట మోహన్, చిన్న ఆత్మకూర్కు లచ్చిగారి రవీందర్, వదల్పర్తికి ఈగ శ్రీనివాస్ రెడ్డి, వెంకంపల్లికి మాటూర్ గోపాల్, రాఘవపల్లికి ఏనుగుల మోహన్, పెద్ద ఆత్మకూర్కు యుగేందర్ రెడ్డి, కన్నారెడ్డి గ్రామానికి దండు సురేందర్, పోచారం గ్రామానికి కాలాలి నర్సాగౌడ్ను నియమించారు.
