అక్షరటుడే, వెబ్డెస్క్: Narendra Modi Stadium Water Price | టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరుగాంచిన ఈ వేదికలో మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వేలాది మంది ప్రేక్షకులు హాజరయ్యారు.
అయితే మ్యాచ్ ఉత్సాహంతో వచ్చిన అభిమానులకు స్టేడియం లోపల విక్రయించిన వస్తువుల ధరలు మాత్రం పెద్ద షాక్ ఇచ్చాయి.సోషల్ మీడియా (Social Media)లో వైరల్గా మారిన ఒక వీడియో ప్రకారం, స్టేడియం లోపల సాధారణంగా బయట మార్కెట్లో కేవలం రూ.20కే లభించే ఒక లీటర్ మంచినీళ్ల బాటిల్ను అక్కడి వెండర్లు రూ.200 నుంచి రూ.300 వరకు విక్రయించినట్లు తెలుస్తోంది.
Narendra Modi Stadium Water Price | మరీ ఇంత దోపిడా…
వీడియోలో ఒక అభిమాని నీళ్ల బాటిల్ ధర అడగగా, అక్కడి సిబ్బంది నిర్మొహమాటంగా రూ.200 అని చెప్పడం కనిపిస్తోంది. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్టేడియం యాజమాన్యం మాత్రం తాగునీరు ఉచితంగా అందుబాటులో ఉంచామని చెబుతోంది. కానీ స్టేడియంలో ఎక్కడా ఉచిత నీటి సౌకర్యం కనిపించలేదని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఫైనల్ మ్యాచ్ కావడంతో స్టేడియం కిక్కిరిసిపోవడం, భద్రతా కారణాల దృష్ట్యా బయటి నుంచి నీళ్ల బాటిళ్లను అనుమతించకపోవడం విక్రేతలకు అవకాశం కల్పించిందని వారు అంటున్నారు.
Narendra Modi Stadium Water Price | క్రికెట్ అభిమానుల ఆవేదన
నీళ్ల బాటిళ్లతో పాటు స్నాక్స్, కూల్డ్రింక్స్ ధరలు (Prices of Cold Drinks) కూడా సాధారణ మార్కెట్ ధరల కంటే మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నాయని పలువురు అభిమానులు తెలిపారు. వేల రూపాయలు వెచ్చించి టికెట్లు కొనుగోలు చేసి, హోటళ్లలో బుకింగ్స్ చేసి మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చిన తమకు కనీసం మంచినీరు కూడా సరసమైన ధరలకు అందించకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందని క్రికెట్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..ఈ ఘటనపై సోషల్ మీడియా (Social Media)లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. స్టేడియం నిర్వహణపై చర్యలు తీసుకోవాలని, ప్రేక్షకులకు కనీస అవసరాలైన తాగునీరు వంటి సేవలు సరసమైన ధరలకు అందుబాటులో ఉండేలా చూడాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: India T20 Final | ఫైనల్లో దంచికొట్టిన భారత్.. కివీస్ లక్ష్యం 256

