అక్షరటుడే, ఎల్లారెడ్డి: Navodaya Results | నిజాంసాగర్ నవోదయ ఫలితాలు విడుదలయ్యాయి. 2026–27కు విద్యాసంవత్సరానికి సంబంధించి ఆరో తరగతి ప్రవేశపరీక్ష ఫలితాలను మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా నవోదయ ఎగ్జామ్స్ ఇన్ఛార్జి ప్రభాకర్ మాట్లాడుతూ.. గతనెల డిసెంబర్ 13న పరీక్షలు నిర్వహించగా.. నేడు ఫలితాలు విడుదలయ్యాయని పేర్కొన్నారు.
Navodaya Results | సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి
జవహర్ నవోదయ విద్యాలయం ప్రవేశ పరీక్షలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థి సత్తా చాటాడు. ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులతో కలిసి పోటీపడి తన ప్రతిభను నిరూపించాడు. మట్టిలో మాణిక్యంలా.. ఉపాధ్యాయుల మద్దతుతో చదివి కామారెడ్డి జిల్లాలోనే మొదటిస్థానం సాధించాడు.
Navodaya Results | కామారెడ్డి జిల్లాలో..
జానకంపల్లి కుర్దు పాఠశాలకు చెందిన నిషిత్ చంద్ర అనే విద్యార్థి ఇటీవల నిర్వహించిన జవహర్ నవోదయ ఆరో తరగతిలో ప్రవేశ పరీక్షల్లో కామారెడ్డి జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించాడు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడంపై జిల్లా విద్యాశాఖ అధికారి రాజు అభినందనలు వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డి మండలం జానకంపల్లి కుర్దు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సైతం అభినందనలు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో తరగతులు కొనసాగుతున్నాయని చెప్పారు.
ఇది కూడా చదవండి..: Leopard claws case | చిరుత పులి గోళ్లు కత్తిరించిన వ్యక్తి అరెస్ట్

