అక్షరటుడే, వెబ్డెస్క్: Nepal Bus Accident | నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగు భారతీయ యాత్రికులు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. యాత్రికులతో వెళ్తున్న బస్సు నేపాల్లోని గండకి ప్రావిన్స్లో గల గోర్ఖా జిల్లాలో జరిగినట్లు స్థానిక పోలీసు వర్గాలు వెల్లడించాయి.
Nepal Bus Accident | మనకామన ఆలయానికి వెళ్లి వస్తుండగా..
నేపాల్లోని మనకామన ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తున్న ఎలక్ట్రిక్ బస్సు నియంత్రణ కోల్పోయి దాదాపు 200 మీటర్ల లోతు లోయలో పడింది. బస్సులో మొత్తం 16 మంది భక్తులు ప్రయాణిస్తుండగా.. దుర్ఘటనలో బస్సు పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం.
Nepal Bus Accident | మృతుల వివరాలివే..
ప్రమాదంలో మరణించిన ఏడుగురిలో భారతీయ తీర్థయాత్రికులే. వీరిలో ఇద్దరు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. గోర్ఖా జిల్లా ట్రాఫిక్ పోలీసు కార్యాలయ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం.. ముత్తు కుమార్ (58), అనమలిక్ (58), మీనాక్షి (59), శివగామి (53), విజయల్ (57), మీనా (58), తమిళర్సి (60). కాగా.. గాయపడిన ఏడుగురు యాత్రికులను తక్షణం రక్షించి, అంబుఖైరేని ప్రాంతంలోని ఆస్పత్రిలో వైద్య చికిత్స అందిస్తున్నారు. బస్సు డ్రైవర్ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. బస్సు ప్రమాద ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు.
ఇది కూడా చదవండి..: Assembly Election Schedule | మోగిన నగారా.. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్

