అక్షరటుడే, హైదరాబాద్: New Governors Appointed | పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నూతన గవర్నర్లను నియమించింది. మరికొందరిని బదిలీ చేసింది. ఈ మేరకు గురువారం రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ” ఆనంద్ బోస్ రాజీనామాతో ఈ మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఆనంద్ బోస్ రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్గా శివ ప్రతాప్ శుక్లా Shiv Pratap Shukla ను నియమించారు.
New Governors Appointed | సహాయ మంత్రిగా..
ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి శివ ప్రతాప్ శుక్లా గవర్నర్గా ఉన్నారు. శుక్లా ఉత్తరప్రదేశ్ కు చెందినవారు. 2014 ఎన్డీఏ సర్కారులో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా సేవలు అందించారు. ఇక ప్రస్తుత తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేశారు. జిష్ణుదేవ్ వర్మ 2024 జులై 31 నుంచి తెలంగాణ గవర్నర్ గా కొనసాగుతున్నారు.
ఇక తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని పశ్చిమ బెంగాల్ గవర్నర్గా నియమించారు. దీనికితోడు నాగాలాండ్ గవర్నర్ గా నంద కిశోర్ యాదవ్, బిహార్ గవర్నర్ గా లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నెన్ నియమితులయ్యారు.
కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ ఆర్లేకర్ కు తమిళనాడు అదనపు బాధ్యతలు ఇచ్చారు. లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తాను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా బదిలీ చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా లద్దాఖ్ కు బదిలీ అయ్యారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా మాజీ రాయబారి తరణ్ జిత్ సింగ్ సంధూ నియమితులయ్యారు.

