అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad corporation budget | నిజామాబాద్ నగరపాలక సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్కు(corporation budget) పాలకవర్గం ఆమోదం తెలిపింది. శనివారం నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో మేయర్ కూరగాయల ఉమారాణి(mayor Uma Rani) అధ్యక్షతన బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా(Mla Dhanpal), కలెక్టర్ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi), నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ పాల్గొన్నారు.
Nizamabad corporation budget | నిజామాబాద్ కార్పొరేషన్లో..
కార్పొరేషన్ 2026-27 ప్రతిపాదిత బడ్జెట్తో పాటు, 2025-26 సవరించిన అంచనా బడ్జెట్ను సమావేశంలో ప్రవేశపెట్టగా కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. 2025 ఏప్రిల్ 01 నాటికి ప్రారంభ నిల్వ రూ.94.71 కోట్లు కాగా.. 2025-26 సవరణ అంచనా ఆదాయం రూ. 137.17 కోట్లు. మొత్తం కలుపుకుని గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూ.231.88 కోట్లుగా పేర్కొన్నారు. 2026-27 సాధారణ నిధుల అంచనా ఆదాయం రూ.147.63 కోట్లుగా పొందుపరిచారు. ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ గ్రాంట్ల ద్వారా రూ.99.37 కోట్లు సమకూరుతుందని అంచనా వేశారు. మొత్తం అంచనా వ్యయం రూ.247 కోట్లుగా పద్దులో పేర్కొన్నారు. ప్రతిపాదిత బడ్జెట్ వివరాలను సమావేశంలో చదివి వినిపించగా, సభ్యులు ఆమోదం తెలిపారు.
Nizamabad corporation budget | ఎన్నికల వరకే రాజకీయాలు
తమతమ డివిజన్లలో నెలకొన్న సమస్యలను కార్పొరేటర్లు ప్రస్తావించగా, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే ధన్పాల్, కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఎన్నికల వరకే రాజకీయాలు పరిమితం అని, నిజామాబాద్ నగర అభివృద్దే ధ్యేయంగా అందరం పార్టీలకు అతీతంగా కృషి చేద్దామని ఎమ్మెల్సీ అన్నారు. నగరానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు తెలిపారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు.
Nizamabad corporation budget |అన్ని డివిజన్లనకు..
అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులో అన్ని డివిజన్లకు సమ ప్రాధాన్యత ఇవ్వాలని (Telangana municipal) మున్సిపల్ అధికారులకు మహేశ్గౌడ్ సూచించారు. పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ అమలు అనివార్యంగా మారిందన్నారు. ఇప్పటికే ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరిగిందని, ఎవరికీ ఎలాంటి అన్యాయం జరుగకుండా ఉండేందుకు ముసాయిదా ప్లాన్లో ఏవైనా సవరణలు చేయాల్సి ఉంటే వాటిని చేపట్టేందుకు వీలుగా కార్పొరేటర్లతో భేటీ నిర్వహించాలని సూచించారు.
అంకితభావతో కృషి చేయాలి
ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం వాటిల్లకుండా, వారికి జవాబుదారీగా వ్యవహరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కార్పొరేటర్లు ప్రస్తావించే ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అంకిత భావంతో కృషి చేయాలన్నారు. ఆయా డివిజన్లలో నెలకొని ఉన్న సమస్యలపై చర్చించి, పరిష్కారం చూపేందుకు వీలుగా(local governance) నెల రోజులలోపే మేయర్ అనుమతితో నగర పాలక సంస్థ(Telangana politics) ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని సూచించారు. కార్పొరేషన్ ఆదాయ వనరులను పెంపొందించుకునేందుకు(civic development) వీలుగా ప్లాట్ల క్రమబద్దీకరణ దరఖాస్తులను క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా పారదర్శకంగా పరిష్కరిస్తూ అర్హత కలిగిన వారికి అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, నగర పాలక సంస్థకు చెందిన వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Nizamabad outsourcing salary scam | ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు పెద్ద స్కాం..: ఎమ్మెల్యే ధన్పాల్

