అక్షరటుడే, ఇందూరు: Nizamabad DJ Issue | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీరామ నవమిని పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని హమాల్వాడి సంతోషి మాత (సాయిబాబా) ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. కాగా, ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన డీజే సౌండ్ సమస్యకు దారితీసింది.
Nizamabad DJ Issue | అనుమతి లేదని..
శోభాయాత్రలో నిర్వాహకులు డీజే ఏర్పాటు చేశారు. అయితే, డీజేకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అక్కడికి చేరుకున్నారు. 
స్వయంగా డ్రైవింగ్..
పోలీసులను సముదాయించే ప్రయత్నం చేశారు. అనుమతి లేకుండా డీజే ఏర్పాటుకు ఒప్పుకొనే ప్రస్తక్తే లేదని పోలీసులు కరాఖండిగా చెప్పేశారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే.. ఒక ఎమ్మెల్యే కూడా చెబితే వినరా.. అంటూ తానే స్వయంగా డీజే వాహనంలో దానిని నడిపించుకుంటూ శోభాయాత్రలో ముందుకు కదిలారు. దగ్గరుండి కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు.

