అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad Drunk Driving | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ (Nizamabad Police) పరిధిలో పోలీసులు డ్రంకన్ డ్రైవ్ (Drunk Driving Cases) తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో భారీగా కేసులు (Telangana Traffic Police) నమోదు చేస్తున్నారు.
Nizamabad Drunk Driving | రెండు వారాల్లోనే..
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన రెండు వారాల్లో 246 డ్రంకన్ డ్రైవ్ కేసులు (Traffic Law Enforcement) నమోదు కాగా, సంబంధిత కోర్టులు రూ. 20.30 లక్షలు జరిమానా విధించినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (Police Commissioner Sai Chaitanya) వెల్లడించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ (Traffic Violations) పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కేసులు నమోదయ్యాయన్నారు.
Nizamabad Drunk Driving | 16 మందికి జైలు శిక్ష..
ఈ తనిఖీల్లో అతిగా మద్యం తాగి వాహనాలు నడిపిన 16 మందికి కోర్టులు (Road Safety India) జైలుశిక్ష విధించాయన్నారు. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 7 వరకు వాహన తనిఖీలు నిర్వహించామన్నారు. ఇందులో మొత్తం 246 కేసుల నమోదు చేయడం జరిగిందన్నారు.
మౌఖిక విచారణ కేసులు త్వరగా పరిష్కరించాలి..
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో మౌఖిక విచారణల (OE) కేసులు త్వరగా పరిష్కరించి రిపోర్ట్ అందజేయాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో సీపీ విచారణ అధికారులకు తగు సూచనలు చేశారు. పెండింగ్లో ఉన్న 17 మౌఖిక విచారణ దర్యాప్తును ముమ్మరం చేయాలని పకడ్బందీగా విచారించి రిపోర్టు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఈ మేళాలో మూడు మౌఖిక దర్యాప్తులు ముగిసినందున వెంటనే దర్యాప్తు సారాంశాన్ని పంపించాల్సిందిగా ఆదేశించారు. అడిషనల్ డీసీపీ (అడ్మిన్) బస్వా రెడ్డి, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్, సీటీసీ ఏసీపీలు వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, మస్తాన్ అలీ, రాజశేఖర్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, దర్యాప్తు అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Maoists Surrender Revanth Reddy | అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులందరూ లొంగిపోవాలి: సీఎం రేవంత్రెడ్డి

