అక్షరటుడే, ఇందూరు: Nizamabad Hospital Toddy | నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కల్లు ప్యాకెట్లు తీవ్ర కలకలం రేపాయి. ఆసుపత్రిలో ఇద్దరు వ్యక్తుల వద్ద కల్లు ప్యాకెట్లను సెక్యూరిటీ గార్డులు గుర్తించారు.
Nizamabad Hospital Toddy | సెక్యూరిటీ గార్డులు
సదరు కల్లు ప్యాకెట్లతో తిరుగుతున్న వ్యక్తులను సెక్యూరిటీ గార్డులు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కల్లు ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని, ఒకటో ఠాణా పోలీసులకు సదరు వ్యక్తులను అప్పగించారు.

కల్లు ప్యాకెట్లతో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో తిరుగుతున్న వ్యక్తులను విచారిస్తే.. పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారు. ఇద్దరిలో ఒకడు మైనరా.. లేక యువకుడా.. అనేది తెలియాల్సి ఉంది.
ఇక మధ్య వయసులో ఉన్న వ్యక్తి పేరు సిద్ధార్థగా చెబుతున్నాడు. తన సొంత ప్రాంతం సిరిసిల్లా జిల్లాలోని రావుడ గ్రామంగా పేర్కొంటున్నాడు.

