అక్షరటుడే, బాన్సువాడ: Nizamsagar Canal Incident | భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగా ఓ మహిళ ఆవేశంలో నిజాంసాగర్ (Nizamsagar) ప్రధాన కాల్వలో దూకింది. ఈ ఘటన వర్ని వద్ద మంగళవారం చోటుచేసుకుంది.

Nizamsagar Canal Incident | బస్టాండ్ వద్ద గొడవ..
కోటగిరి (Kotagiri)కి చెందిన భార్యాభర్తలు వర్ని బస్టాండ్ వద్ద వ్యక్తిగత కారణాలతో గొడవపడ్డారు. ఈ గొడవతో మనస్తాపానికి గురైన భార్య లక్ష్మి క్షణికావేశంలో సమీపంలోని నిజాంసాగర్ ప్రధాన కాల్వలోకి దూకింది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు. కాలువలోకి దూకిన లక్ష్మిని నీటిలో నుంచి బయటకు తీసి ప్రథమ చికిత్స అందించారు. 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆమెను ప్రభుత్వ ఆస్పత్రి (Government Hospital)కి తరలించారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికుల అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పిందని పలువురు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Cleanliness Drive | పరిశుభ్రతలో ప్రజలు భాగస్వాములు కావాలి: సబ్ కలెక్టర్ కిరణ్మయి

