అక్షరటుడే, కోటగిరి: Nizamsagar water release | నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగుచేస్తున్న యాసంగి పంటల కోసం నీటి విడుదల చేపట్టారు. ఈ మేరకు నిర్ణయం తీసుకోగా.. ప్రాజెక్టు నుంచి బుధవారం నీటిని విడుదల చేశారు.
Nizamsagar water release | నాల్గో విడతలో భాగంగా..
ప్రధాన కాలువ ద్వారా 4వ విడతలో భాగంగా.. 1200 క్యూసెక్కుల చొప్పన నీటిని బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో కాల్వల పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు, రైతులు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని, కాలువలోకి లేదా కాలువ ఒడ్డు సమీపానికి వెళ్లవద్దని అధికారులు సూచించారు. ప్రజల భద్రత దృష్ట్యా అందరూ సహకరించాలని నీటిపారుదల శాఖ (Irrigation Department) నిజాంసాగర్ ప్రాజెక్ట్ అధికారులు కోరారు.
ఇది కూడా చదవండి..: Society Name Forgery | ఫోర్జరీ చేసి సొసైటీ పేరును మార్చారు.. సీపీకి మాణిక్ భవన్ కమిటీ ఫిర్యాదు

