అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: NSUI Foundation Day | కాంగ్రెస్ పార్టీలో (Nizamabad Congress) వ్యక్తిగత ఎజెండాలకు తావులేదని నగరాధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ (Bobbili Ramakrishna) అన్నారు. ఎన్ఎస్యూఐ (NSUI) ఫౌండేషన్ డే సందర్భంగా నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా (Congress Party Agenda) ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
NSUI Foundation Day | డీఎస్, బొమ్మ మహేశ్.. ఎన్ఎస్యూఐ నుంచి వచ్చినవారే..
ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ.. 1971లో కేరళ స్టూడెంట్స్ యూనియన్, పశ్చిమ్ బెంగాల్ స్టేట్ ఛాత్ర పరిషత్లను విలీనం చేసి ఒక జాతీయ విద్యార్ధి సంస్థను ఏర్పాటు చేశారన్నారు. 1971 ఏప్రిల్ 9వ తేదీన ఇందిరా గాంధీ ఆధ్వర్యంలో వాటిని కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘాలుగా విలీనం చేసుకుని నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియాగా ఆవిర్భవించిందన్నారు. జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్ తన రాజకీయాన్ని ఎన్ఎస్యూఐ విభాగం నుంచే ప్రారంభించి నేడు పీసీసీ చీఫ్గా (PCC Chief Bomma) ఎదిగారని గుర్తు చేశారు. అదేవిధంగా జిల్లాలో డి శ్రీనివాస్ (D Srinivas) సైతం ఎన్ఎస్యూఐ నాయకుడి నుంచి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి వరకు తన ప్రస్థానం కొనసాగించారన్నారు.
NSUI Foundation Day | ప్రత్యేక ఎజెండా అంటూ ఏమీ లేదు..
ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్లు (Youth Congress) రెండు కాంగ్రెస్ పార్టీకి అనుబంధ విభాగాలని బొబ్బిలి రామకృష్ణ అన్నారు. వీటికి ప్రత్యేక ఎజెండాకు ఏమీ ఉండదని వ్యక్తిగత ఎజెండా కూడా ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆదేశాలను నియమాలను రెండు విభాగాలు పాటించాల్సి ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో ఎవరైనా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని వ్యక్తిగత ఏజెండాలు పెట్టుకొని పని చేయకూడదని స్పష్టం చేశారు. పార్టీ ఇచ్చే ఆదేశాలను నియమాలను పాటిస్తూ పార్టీ అభివృద్ధికి దోహద పడాలని సూచించారు. త్వరలోనే జిల్లా ఎన్ఎస్యూఐ కమిటీని ఎన్నికల ద్వారా గాని ఇంటర్వ్యూ ద్వారా నియమిస్తామన్నారు.
ఎవరైనా పార్టీ నియమాలను ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని రామకృష్ణ అన్నారు. అలాగే ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ అధ్యక్షులు శరత్, జీవీ రామకృష్ణ , రాంభూపాల్, గన్ రాజ్, విపుల్ గౌడ్ తదితరులు ఎన్ఎస్యూఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు శరత్ కుమార్, సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, జండా గుడి ఛైర్మన్ ప్రమోద్, నిజామాబాద్ కార్పొరేషన్ డీసీసీ కోశాధికారి శివకుమార్, యువజన కాంగ్రెస్ నాయకులు దత్తు, కృపాల్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
