అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: NSUI Nizamabad | నగరంలోని గిరిరాజ్ కళాశాలలో (Giriraj College Nizamabad) ఘనంగా ఎన్ఎస్యూఐ ఆవిర్భావ దినోత్సవాన్ని(NSUI Foundation Day) నిర్వహించారు. ఎన్ఎస్యూఐ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరదబట్టు వేణురాజ్ జెండావిష్కరణ చేశారు.
NSUI Nizamabad | ఎస్ఎస్యూఐ విద్యార్థికి ప్రశ్నించే తత్వాన్ని నేర్పుతుంది..
ఈ సందర్భంగా వేణురాజ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, స్వేచ్ఛ, నాణ్యమైన విలువల ఆధారంగా బాధ్యతాయుతమైన పౌరులు, నాయకులను రూపొందించేందుకు ఎన్ఎస్యూఐ కృషి చేస్తోందన్నారు. కేరళ(Kerala) విద్యార్థి సంఘం, పశ్చిమ బెంగాల్ (West Bengal) ఛత్ర పరిషత్లను విలీనం చేస్తూ 1971లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎన్ఎస్యూఐని ఏర్పాటు చేశారన్నారు. నేడు దేశంలోని అతిపెద్ద విద్యార్థి సంఘంగా నిలబడిందన్నారు. ఎన్ఎస్యూఐ ప్రతిఒక్క విద్యార్థికి చిన్ననాటి నుంచే ప్రశ్నించే తత్వం సమస్యలపై పోరాడేతత్వం నాయకత్వ లక్షణాలను నేర్పుతుందన్నారు.
NSUI Nizamabad | ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక పోరాటాలు..
జిల్లాలో ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యారంగ సమస్యలపై అనేక పోరాటాలు చేశామని వేణురాజ్ అన్నారు. విద్యార్థి వ్యతిరేక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నిరసిస్తూ ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడంలో నిజామాబాద్ ఎన్ఎస్యూఐ ముందుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరిగిన అవినీతి అక్రమాలపై పోరాటం చేసి వైస్ఛాన్స్లర్ను తొలగించేదాకా పోరాడినట్లు తెలిపారు. బాసర (Basara) త్రిబుల్ ఐటీలో విద్యార్థులు సమస్యలపై ఉద్యమిస్తుంటే అప్పటి పీసీసీ అధ్యక్షుడు ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డిని (CM Revanth reddy) త్రిపుల్ ఐటీకి తీసుకెళ్లామన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ నాయకులు సాయి కిరణ్ రెడ్డి, శివ, హరీష్, కౌశిక్, శివ, గణేష్ రెడ్డి, కనకరాజ్, మనీష్, దినేష్, గిరిరాజ్ ప్రభుత్వం కళాశాల విద్యార్థులు వికాస్, రాహుల్, చిన్నయ్య, అభిలాష్, వంశీ, తదితరులు పాల్గొన్నారు.
