అక్షరటుడే, వెబ్డెస్క్: Oman Drone Attack | ఒమన్పై ఇరాన్ విరుచుకుపడింది. సోహార్ నగరంపై డ్రోన్లతో దాడికి దిగింది. ఈ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు. మరో 11 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో 10 మంది భారతీయులేనని తెలిసింది.
Oman Drone Attack | ఇప్పటి వరకు ఐదుగురు..
గాయపడ్డవారిలో అయిదుగురు చికిత్స తీసుకుంటున్నారని భారత విదేశాంగ తెలిపింది. మిగతావారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు వెల్లడించింది. కాగా, యుద్ధం ప్రారంభం అయ్యాక ఇప్పటి వరకు ఐదుగురు భారతీయులు మరణించారు.
స్వదేశానికి 1.50 లక్షల మంది..
ఇరాన్ – ఇజ్రాయెల్ – అమెరికా యుద్ధం ప్రారంభమయ్యాక పశ్చిమాసియా ప్రాంతం నుంచి ఇప్పటి వరకు 1.50 లక్షల మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చేసినట్లు భారత విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి (గల్ఫ్ విభాగం) అసీం మహాజన్ తెలిపారు.

