అక్షరటుడే, కామారెడ్డి: Omkareshwara Temple Festival | పట్టణంలోని జయశంకర్ కాలనీ (Jayashankar Colony)లో గౌరీ సమేత ఓంకారేశ్వర ఆలయ నాలుగో వార్షికోత్సవ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి.
గురువారం ఉదయం నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వార్షికోత్సవం సందర్భంగా ఉదయం గణపతి పూజ, గోమాత పూజ నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయం ఆవరణలో లోక కల్యాణార్థం హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Omkareshwara Temple Festival | ప్రముఖ శాస్త్రవేత్త..
ఆలయ వార్షికోత్సవ ఈ కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రవేత్త, ఎల్లారెడ్డి బీజేపీ నాయకుడు పైడి ఎల్లారెడ్డి స్వామి (Paidi Yella Reddy Swamy) వారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పైడి ఎల్లారెడ్డికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు కపిల ప్రభాకర్, కంది శివరాములు, వీరన్న పటేల్, పట్నం శెట్టి శ్రీనివాస్, మాధవి శెట్టి ఆంజనేయులు, గంజి సంగమేశ్వర్, శేవెళ్ల రాజు పటేల్, బండాయప్ప స్వామి, నాగేష్, తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Bus Accident | బస్సు ప్రమాదం.. డిప్యూటీ తహశీల్దార్కు గాయాలు..

