అక్షరటుడే, కామారెడ్డి: Owaisi Brothers Home Department | రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడి తప్పాయని, హోంశాఖను ఒవైసీ బ్రదర్స్ చేతిలో(Owaisi Brothers Home Department) పెట్టారని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కామారెడ్డి ఎమ్మెల్యే నివాసంలో శనివారం బీజేఎల్పీ సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
Owaisi Brothers Home Department | కాంగ్రెస్ గుండాలతో..
ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కామారెడ్డిలో (Kamareddy) ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడి హేయనీయమన్నారు. ఎమ్మెల్యేకే ఈ పరిస్థితి ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై గెలిచిన ఎమ్మెల్యేకు సెక్యూరిటీ ఇవ్వకుండా కాంగ్రెస్ గుండాల హత్యాయత్నం చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేపై హత్యాయత్నానికి పాల్పడిన కాంగ్రెస్ గుండాలపై కేసు నమోదు చేయకుండా బీజేపీ కార్యకర్తలపై దాడిచేసి అరెస్ట్ చేయడం కక్షసాధింపు చర్యలో భాగమేనన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు గతి తప్పాయని, బాన్సువాడ, నాగర్ కర్నూల్, నిర్మల్ ఘటనలే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో హోంశాఖ మంత్రి లేడని, సీఎం దగ్గరే ఆ శాఖ ఉందని, వీటన్నింటికి సీఎం రేవంత్ రెడ్డే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
Owaisi Brothers Home Department | బీజేఎల్పీ సమావేశంలో తీర్మానాలు..
బీజేఎల్పీ సమావేశంలో ఈ మేరకు పలు తీర్మానాలు చేశామని శాసనసభాపక్ష నేత పేర్కొన్నారు. కేంద్రం తెచ్చిన బడ్జెట్ దేశాభివృద్ధికి పెద్దపీట వేసిందని, దీనికి ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేశామన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అయిందనడానికి సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలే నిదర్శనమన్నారు. గతంలో కంటే బీజేపీ ఓటు బ్యాంక్ మెరుగుపడిందని, 2028లో బీజేపీ అధికారంలోకి వచ్చే దిశగా ముందుకు వెళ్తోందని చెప్పారు. ఎమ్మెల్యేపై దాడి తర్వాత పరామర్శకు వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎక్కడిక్కకడ ఇళ్లలోనే నిర్బంధించడం దారుణమన్నారు. గతంలో సాయంత్రం లోపు వదిలిపెట్టేవారని, ఇప్పుడు 48 గంటల పాటు నిర్బంధించడం శోచనీయమని పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వ తప్పిదాలు కప్పిపుచ్చుకోవడానికే ఎదురుదాడికి పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.
Owaisi Brothers Home Department | ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత తేకుండా..
ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత తేకుండా అమలు చేయలేక రాష్ట్రం దివాళా తీసిందని మహేశ్వర్ రెడ్డి అన్నారు. హామీలు అమలు చేయలేని ప్రభుత్వానికి అధికారంలో ఉండే నైతిక హక్కు ఉందా అని ప్రశ్నించారు. హోంశాఖ సీఎం చేతిలో ఉందా.. ఒవైసీ బ్రదర్స్ చేతిలో ఉందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. బాన్సువాడలో జరిగిన ఘటనలో అనవసరంగా బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారా అని నిలదీశారు. ఎంఐఎం ఒత్తిడికి లొంగిపోయి కుట్రలు చేస్తారా అని ప్రశ్నించారు. స్టీరింగ్ మా చేతిలో ఉందని చెప్తున్న ఒవైసీ బ్రదర్స్ మాటలకు సీఎం చేతలకు అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు. వడగళ్ల వానకు పంటలు నష్టపోతే ఇప్పటికి నివేదిక తయారు చేయలేదని, రైతులను ఆదుకోవాలని అసెంబ్లీలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. ఫసల్ బీమా పథకంలో ప్రభుత్వం చేరకుండా రైతులను మోసం చేస్తోందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు, విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. వచ్చే నెల 7న ఆదిలాబాద్ రైతుల నుంచి పంటల భీమాపై దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు.
Owaisi Brothers Home Department | బీజేఎల్పీ తీర్మానాలు
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి నివాసంలో బీజేఎల్పీ సమావేశం నిర్వహించారు. శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పలు తీర్మానాలు చేశారు. సమావేశం వివరాలను ఎమ్మెల్యే పాయల్ శంకర్ వివరించారు. శాతిభద్రతల విషయంలో అసెంబ్లీలో చర్చ, ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలి, రాష్ట్రంలో రైతులకు పంటల బీమా అమలుపై ఒత్తిడి, దేశాభివృద్ధికి పెద్దపీట వేస్తూ కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు వెంకట రమణారెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రామారావు పటేల్, పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, ఏవీఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Owaisi Brothers Home Department | భారీ బందోబస్తు
క్యాంప్ కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు బాన్సువాడకు వెళ్తున్నారన్న సమాచారంతో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేస్తారని ప్రచారం సాగింది. అయితే సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బాన్సువాడకు బయలుదేరారు.
ఇది కూడా చదవండి..: Gandhari Mandal | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల జైలు

