అక్షరటుడే, గాంధారి: Paddy Purchase Centers | రైతులకు సరిపడా విధంగా కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని (Gandhari Mandal) డిప్యూటీ తహశీల్దార్కు సోమవారం వినతిపత్రం సమర్పించారు.
Paddy Purchase Centers | కనీస సౌకర్యాలు కల్పించాలి..
అనంతరం కిసాన్ సంఘ్ నేతలు మాట్లాడుతూ మొక్కజొన్న(Maize Crop), జొన్న, వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి అక్కడ కనీస సౌకర్యాలు కల్పించాలని, యూరియా యాప్ను తొలగించి రైతులకు సరిపడా యూరియాను ఇప్పించాలని కోరారు. రైతుల భూమి విస్తీర్ణం మేరకు రైతు భరోసా అందించాలన్నారు. యాసంగి పంటలు మొక్కజొన్న, వరి, జొన్న పంటలు కోతకు వచ్చాయని.. వెంటనే కేంద్రాలు ఏర్పాటు చేయాలని విన్నవించారు. వర్షాలు(Hailstone) పడకముందే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు.
Paddy Purchase Centers | యూనియా యాప్తో ఇబ్బందులు..
యూరియా కోసం రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని కిసాన్ సంఘ్ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రభుత్వం యూరియా యాప్ను (urea shortage issue) తొలగించి రైతులకు సరిపడే యూరియాలను ఇప్పించాలని కోరుతున్నామన్నారు. అంతేకాకుండా రైతు భరోసా ఇవ్వాలని అధికారులను విన్నవించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కిసాన్ సంఘ్ నేతలు, రైతులు పాల్గొన్నారు.
