అక్షరటుడే ఇందూరు: Paddy storage warehouses | వరి ధాన్యాన్ని నిలువ చేసేందుకు వీలుగా గోడౌన్లను గుర్తించాలని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి(MLA Sudarshan Reddy) అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్లో శనివారం కలెక్టర్ ఇలా త్రిపాఠితో (Collector Ila Tripathi) కలిసి సమావేశం నిర్వహించారు. ఒక్కోశాఖ వారీగా అభివృద్ధి పనుల ప్రగతి గురించి అడిగి తెలుసుకున్నారు.
Paddy storage warehouses | రైస్మిల్లర్లకు కేటాయించిన ధాన్యం..
రైస్ మిల్లర్లకు కేటాయించిన ధాన్యం ఎంత..? (Agricultural development India) లేవీ రూపంలో వారు ఎఫ్సీఐకి (FCI rice stocks) ఎంత బియ్యం నిల్వలు(Indur district news) అందించారు.. ఇంకా ఎంత లేవీ రావాల్సి ఉంది.. ఎన్ని గోడౌన్ల (Agricultural development India) అందుబాటులో ఉన్నాయనే వివరాలను సుదర్శన్ రెడ్డి ఆరా తీశారు. లేవీ అందించడంలో విఫలమైన 57 మంది డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి (Paddy storage warehouses) రూ.276 కోట్లు రికవరీ చేసేందుకు నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు.
Paddy storage warehouses | గ్రామాల్లో డ్రెయినేజీలు, తాగునీటి వ్యవస్థ..
జిల్లాలో అవసరమైన అన్ని గ్రామాల్లో రోడ్లు డ్రెయినేజీలు, తాగునీటి సరఫరా మెరుగుపర్చే విధంగా పనులు జరిపించాలని సుదర్శన్రెడ్డి తెలిపారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం భవిత కేంద్రాల నిర్మాణ పనులను తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా పర్యవేక్షణ చేయాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజిరెడ్డి, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: National Science Day celebration | విద్యార్థులు సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి: కాంగ్రెస్ పార్టీ నాయకులు రామర్తి గోపి

