అక్షరటుడే, వెబ్డెస్క్ : Pakistan Afghanistan Airstrikes War | అఫ్గానిస్థాన్పై పాక్ యుద్ధం ప్రకటించింది. పలు నగరాలపై వైమానిక దాడులు చేసింది. తాజా దాడుల తర్వాత బహిరంగ యుద్ధం జరుగుతోందని పాకిస్తాన్ రక్షణ మంత్రి తెలిపారు.
రెండు దేశాల మధ్య కొంతకాలంగా సరిహద్దు ఘర్షణలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్ యుద్ధానికి దిగింది. ‘మా సహనం నశించింది. ఇక బహిరంగ యుద్ధమే’ అని పాక్ రక్షణ మంత్రి ఖవాజా (Pak Defense Minister Khawaja) ముహమ్మద్ ఆసిఫ్ ప్రకటించారు. గతంలో సైతం పాక్ వైమానిక దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో తాలిబన్ ప్రభుత్వం పాక్పై దాడులు చేపట్టింది. ఈ క్రమంలో గురువారం రాత్రి పాక్ యుద్ధం ప్రకటించింది. యుద్ధ విమానాలతో కాబూల్, కాందహార్, ఫక్తియా ప్రావిన్స్లపై వైమానిక దాడులు చేపట్టింది. దీంతో అఫ్గాన్ సైతం ఎదురుదాడికి దిగింది.
Pakistan Afghanistan Airstrikes War | పాక్ ప్రధాని హెచ్చరిక
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అఫ్గానిస్థాన్ను హెచ్చరించారు. తమ దళాలు ఏదైనా దురాక్రమణను అణిచివేయగలవని చెప్పారు. ఏదైనా దూకుడు ఆశయాలను అణిచివేయగల పూర్తి సామర్థ్యం దళాలకు ఉందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. దేశం మొత్తం సైన్యానికి అండగా ఉంటుందన్నారు. పాక్ వైమానిక దాడులను తాలిబాన్ ప్రభుత్వం ధ్రువీకరించింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు.
Pakistan Afghanistan Airstrikes War | ఆపరేషన్ గజాబ్ లిల్ హక్
పాకిస్థాన్ ఆపరేషన్ గజాబ్ లిల్ హక్ పేరిట వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో 133 మంది అఫ్గాన్ సైనికులు మరణించారని పాక్ తెలిపింది. తాలిబన్లు సరిహద్దుపై దాడి చేసిన తర్వాత పాక్ కాబూల్పై బాంబు దాడి చేసింది. కాగా తమ దాడిలో తన ఎనిమిది మంది సైనికులు మరణించారని ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ నివేదించింది. అఫ్గాన్ దళాలు సరిహద్దు దళాలపై దాడి చేసిన కొన్ని గంటల తర్వాత పాక్ యుద్ధానికి దిగింది.
Pakistan Afghanistan Airstrikes War | 55 మంది పాక్ సైనికులు మృతి
తమ దాడిలో 55 మంది పాక్ సైనికులు చనిపోయినట్లు తాలిబన్లు పేర్కొన్నారు. పాకిస్థాన్ (Pakistan) మాత్రం ఇద్దరు సైనికులు చనిపోయినట్లు తెలిపింది. పాక్లోని పలు సైనిక స్థావరాలను ధ్వంసం చేశామని, 19 పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు తాలిబన్ దళాలు తెలిపాయి. నంగర్హార్లోని శరణార్థి శిబిరంపై జరిగిన క్షిపణి దాడిలో ఎనిమిది మంది ఆఫ్ఘన్ యోధులు మరణించగా, 11 మంది గాయపడ్డారని పేర్కొన్నాయి.
Pakistan Afghanistan Airstrikes War | తీవ్ర ఉద్రిక్తతలు
రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అయ్యాయి. పాక్ యుద్ధం ప్రారంభించడంతో అఫ్గాన్ సైతం దాడులకు పాల్పడే అవకాశం ఉంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి ఇరాన్ ముందుకు వచ్చింది. రెండు దేశాల మధ్య అవగాహన, సహకారాన్ని పెంపొందించడానికి అవసరమైన సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి తెలిపారు.
ఇది కూడా చదవండి..: Travel Advisory | ఇరాన్లో ఉండొద్దు.. భారత పౌరులకు కేంద్రం అడ్వైజరీ

