అక్షరటుడే, వెబ్డెస్క్ : Pakistan Fuel Crisis | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో పాకిస్థాన్లో ఇంధన సంక్షోభం తలెల్తింది. దీంతో ఆ దేశంలో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. గతంలో పెట్రోల్, ఢీజిల్ ధరలను పెంచిన పాక్ ప్రభుత్వం తాజాగా.. హై-ఆక్టేన్ ఇంధనం ధరను 200శాతం పెంచింది.
ఇరాన్ హార్ముజ్ జలసంధి (Strait of Hormuz)ని మూసివేయడంతో పాక్లో ఇంధన సంక్షోభం తలెత్తింది. ఇప్పటికే ఆ దేశం పలు కఠిన ఆంక్షలు అమలు చేస్తుంది. దీంతో హై-ఆక్టేన్ ఇంధనం ధరను భారీగా పెంచాలని ఆదివారం నిర్ణయించింది. లీటరు ధరను 200 పాకిస్తానీ రూపాయలు పెంచి, 100 పీకేఆర్ల నుండి 300 పీకేఆర్లకు చేర్చినట్లు సమాచారం. లగ్జరీ వాహనాల్లో దీనిని వినియోగిస్తారు. ఈ ఇంధనంపై సుంకాన్ని భారీగా పెంచేందుకు పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ (Pakistan PM Shehbaz Sharif) ఆమోదం తెలిపారు.
Pakistan Fuel Crisis | భారీగా ఆదా
ప్రభుత్వం హై ఆక్టేన్ ఇంధన ధరలు (High-Octane Fuel Prices) పెంచడంతో ప్రభుత్వానికి నెలకు 9 బిలియన్ల రూపాయలు ఆదా అవుతాయి. ఈ డబ్బులను ప్రజలకు ఖర్చు చేస్తామని పాక్ ప్రధాని తెలిపారు ఈ భారాన్ని దేశంలోని అత్యంత సంపన్న వర్గం భరిస్తుందన్నారు. హై-ఆక్టేన్ ఇంధన ధరల పెరుగుదల ప్రజా రవాణా ఛార్జీలు, విమాన ప్రయాణ ఖర్చులపై ప్రభావం చూపదు.
Pakistan Fuel Crisis | పాక్లో పెట్రోలు ధరలు
హార్ముజ్ జలసంధి మూసివేత తర్వాత రిటైల్ ఇంధన ధరలను గతంలోనే పాక్ పెచింది. పెట్రోల్ ధరలు సుమారు 20 శాతం పెరిగి, లీటరుకు PKR 266 నుంచి PKR 321కి చేరాయి. డీజిల్ ధర లీటరుకు PKR 336కి చేరుకుంది. గ్యాస్ సిలిండర్ ధర పాక్ కరెన్సీలో 2664 కు చేరింది.
ఇది కూడా చదవండి..: Iran US tensions | అమెరికాకి ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. విద్యుత్ కేంద్రాలపై దాడి చేయాలని చూస్తే దానిని శాశ్వతంగా మూసివేస్తాం

