అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Pancha Reddy Suresh death | బీజేపీ నాయకుడు, మాజీ కార్పొరేటర్ పంచ రెడ్డి సురేష్ అకాల మరణం (BJP leader death) తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా (Dhanpal Suryanarayana Gupta) విచారం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో (Assembly session) ఉన్న ఎమ్మెల్యే బుధవారం హుటాహుటిన ( Nizamabad news) ఇందూరుకు చేరుకొని, ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు.
Pancha Reddy Suresh death | సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న నాయకుడు సురేష్ అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన సతీమణి పంచరెడ్డి అనిత భారీ మెజారిటీతో విజయం సాధించడం వెనక సురేష్ (Indian politics news) ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. అందరినీ కలుపుకొనిపోయే మనస్తత్వం ఉన్న నాయకుడని (BJP Telangana) తెలిపారు. కార్పొరేటర్గా ప్రజాసేవ చేస్తూ డివిజన్ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. మృదుస్వభావిగా పేరు తెచ్చుకున్న ఆయన గుండెపోటుకు (local leader obituary) గురికావడం తీవ్రంగా కలిచివేసిందన్నారు. వారి కుటుంబానికి బీజేపీ అండగా నిలుస్తుందని చెప్పారు. అనంతరం కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని అందించారు.
ఇది కూడా చదవండి: SSC Exam Vigilance | పరీక్షల సమయంలో అప్రమత్తంగా ఉండాలి: సీపీ సాయిచైతన్య

