అక్షరటుడే, గాంధారి: PDSU National Committee | పీడీఎస్యూ జాతీయ కమిటీ సభ్యుడిగా అనుముల రవీందర్ (Anumula Ravinder) ఎన్నికయ్యారు. పీడీఎస్యూ ప్రథమ జాతీయ మహాసభలు మార్చి 3, 4 తేదీల్లో విజయవాడలోని సింగ్ నగర్లో జరిగాయి.
PDSU National Committee | కామారెడ్డి జిల్లా గాంధారి మండలం..
ఈ మహాసభల్లో కామారెడ్డి జిల్లా (Kamareddy District) గాంధారి మండలం దుర్గం గ్రామానికి చెందిన ఎ.సతీష్ అలియాస్ రవీందర్ను జాతీయ కమిటీ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2010లో ఇంటర్ ఫస్టియర్నుంచి సాధారణ కార్యకర్తగా ఉద్యమ జీవితం ప్రారంభించిన సతీష్ విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ జిల్లాస్థాయి నుండి రాష్ట్రస్థాయికి ఎదిగారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఆయనకు పదవి వరించింది.

PDSU National Committee | అందరకీ సమాన విద్యే లక్ష్యం..
ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ.. అందరికీ సమాన విద్య అందేలా సంఘాన్ని బలోపేతం చేయడానికి కృషిచేస్తానన్నారు. ఉమ్మడి నిజామాబాద్లో (Nizamabad) ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని.. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, జిల్లాలో విద్యా రంగ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ మహాసభల్లో పలు ముఖ్య తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Prajapalana Pragathi Pranalika | భీమ్గల్లో జోరుగా ‘ప్రజల వద్దకే పాలన.. ప్రగతికి ప్రణాళిక’

