అక్షరటుడే, కామారెడ్డి: Pension Protest Incident | అతనికి ప్రతినెలా పింఛన్ వచ్చేది. అయితే కొద్దికాలంగా (Pension protest) నిలిచిపోయింది. పలుమార్లు అధికారులకు విన్నవించినా (Kamareddy news) ఫలితం లేకుండా పోయింది. దాంతో అతను చెట్టెక్కి నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటన భిక్కనూరు మండలం కంచర్ల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.
Pension Protest Incident | గ్రామ సభ వద్ద..
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా గురువారం కంచర్ల గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. అయితే సభలో పలువురు గ్రామస్థులు తమ సమస్యలను అధికారులు, నాయకులకు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన గొల్ల రాములు అనే వ్యక్తి తనకు గతంలో పింఛన్ వచ్చేదని, ప్రస్తుతం నిలిచిపోయిందని గ్రామసభ (rural protest) దృష్టికి తీసుకువచ్చాడు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా(Telangana news) పింఛన్ మంజూరు కావడం లేదని అసహనం వ్యక్తం చేస్తూ (village issues) పక్కన ఉన్న చెట్టుపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. చెట్టుపై నుంచి ఎక్కడ దూకుతాడోనని భయంతో వెంటనే అప్రమత్తమైన గ్రామస్థులు రాములును కిందకు తీసుకువచ్చారు. పింఛన్ మంజూరయ్యేలా కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Public Participation Development | అందరి భాగస్వామ్యంతోనే సత్వర ప్రగతి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
