అక్షరటుడే, బాన్సువాడ: Pocharam Srinivas Reddy | ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని హనుమాన్ (Banswada MLA News) ఆలయం ధర్మశాల నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. బాన్సువాడ పట్టణంలోని (Telangana Temple Development) హనుమాన్ ఆలయ ధర్మశాల, వ్యాయామశాల నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Pocharam Srinivas Reddy | దేవాలయాలు.. ఆధ్యాత్మిక కేంద్రాలు..
ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక బాటలో నడవాలని సూచించారు. ఆలయాల అభివృద్ధి ద్వారా భక్తులకు (Hanuman Temple Banswada) మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మశాల (Telangana Temple Development) నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని ప్రకటించారు. నియోజకవర్గంలోని పలు దేవాలయాల (Temple Dharmashala Construction) అభివృద్ధికి కూడా అవసరమైన నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తామని (Temple Dharmashala Construction) తెలిపారు. భక్తి మార్గంలో నడిచినప్పుడే (Telangana Political News) మనిషి జన్మకు సార్థకత లభిస్తుందన్నారు. కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన ఆలయ (Banswada Local News) కమిటీ అధ్యక్షుడు నార్ల సురేష్ గుప్తాతో పాటు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ అభివృద్ధికి సమిష్టిగా (Telangana Government Funds) కృషి చేయాలని ఎమ్మెల్యే వారికి సూచించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ నార్ల సురేష్ గుప్తా, విద్యాసాగర్ షిండే, నార్ల ఉదయ్, శారద, దాసరి శ్రీనివాస్, పిట్ల శ్రీధర్, ఎజాజ్, కృష్ణారెడ్డి, మోహన్ నాయక్, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Kamareddy ACB Raids | బల్దియాలో 8గంటల పాటు ఏసీబీ సోదాలు.. ప్రభుత్వానికి భారీగా నష్టం జరిగినట్లు గుర్తింపు

