అక్షరటుడే, కామారెడ్డి: POCSO Case Verdict | జిల్లాలో పోక్సో కేసు ఘటనలు పెరిగిపోతున్నాయి. బాధితులు ధైర్యంగా పోలీస్ స్టేషన్కు (kamareddy news) వచ్చి ఫిర్యాదు చేస్తుండటంతో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఓ పోక్సో కేసులో ఓ నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.
POCSO Case Verdict | సాతెల్లి గ్రామానికి చెందిన..
2021 మార్చి 21 ఆదివారం సాతెల్లి గ్రామానికి చెందిన ఓ బాలిక పాఠశాలకు సెలవు ఉండటంతో ఇంట్లో ఒంటరిగా ఉంది. అదే గ్రామానికి చెందిన వ్యక్తి బలవంతంగా తన ఇంట్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు. సాయంత్రం మార్కెట్ నుండి తిరిగి వచ్చిన తల్లికి బాలిక జరిగిన విషయాన్ని (pocso act india) తెలిపింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని నిందితుడు బెదిరించినట్లు బాలిక వెల్లడించింది. ఈ ఘటనపై బాధితురాలి తల్లి ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
POCSO Case Verdict | సాక్ష్యాధారాల సమర్పణ..
ప్రాథమిక విచారణ ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. అనంతరం పూర్తిస్థాయి (women safety india) విచారణ చేపట్టిన పోలీసులు సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించగా కేసు పూర్వాపరాలు, సాక్ష్యాధారాలు, వైద్య నివేదికలను పరిశీలించిన జిల్లా న్యాయమూర్తి డా.సీహెచ్ వీఆర్ఆర్ వరప్రసాద్ నిందితుడికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.15 వేలు జరిమానా విధిస్తూ తీర్పు(child protection laws india) వెలువరించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. అభం శుభం తెలియని చిన్నారుల జోలికొస్తే చట్టం ఊరుకోదని, కాలం గడిచినా నేరస్తులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. పిల్లల రక్షణే తమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ఆపదలో ఉన్నవారు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలని వారికి తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Tamil Nadu NDA seats | తమిళనాడు ఎన్నికలు.. ఎన్డీఏ సీట్ల పంపకం ఖరారు

