అక్షరటుడే, కామారెడ్డి: Praja Palana Development | ప్రజా పాలనలో రాష్ట్రం వేగంగా (Praja Palana) అభివృద్ధి చెందుతోందని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం దోమకొండలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్నారు.
Praja Palana Development | సీసీరోడ్లు, డ్రెయిన్ పనులకు శంకుస్థాపన..
గ్రామంలో రూ.75 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్స్ (rural development) ఇతర పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామసభలో భాగంగా గ్రామస్థులు పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేయగా, కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా గ్రామీణాభివృద్ధి, (Telangana development)మౌలిక వసతుల కల్పన, ఆరోగ్య సేవల మెరుగుదల, రహదారుల నిర్మాణం వంటి పలు రంగాల్లో వేగంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, 99 రోజుల ప్రణాళిక (infrastructure projects) ద్వారా ప్రతి గ్రామంలో అభివృద్ధి (Congress government) ఫలితాలు కనిపిస్తాయన్నారు. దోమకొండ మండలంపై (local governance) ప్రత్యేకంగా దృష్టి సారించి అభివృద్ధి చేసి ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుమోహన్, గ్రామ సర్పంచ్ ఐరేని నర్సయ్య, భిక్కనూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాత రాజు, మాజీ జడ్పీటీసీ తిరుమల గౌడ్, తదితర నాయకులు పాల్గొన్నారు.
Praja Palana Development |ప్రభుత్వ ఆస్పత్రి పరిశీలన
దోమకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని షబ్బీర్ అలీ పరిశీలించారు. ఇటీవల ప్రభుత్వం 30 పడకల దోమమండ ఆస్పత్రిని 50 పడకలుగా మార్చింది. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని రోగులను పరామర్శించిన షబ్బీర్ అలీ వసతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో చర్చించారు. వైద్యుల కొరత ఉందని చెప్పడంతో ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి ముగ్గురు వైద్యులను త్వరలో నియమిస్తామని తెలిపారు.
ఇది కూడా చదవండి: Huzurabad Dumping Yard | నేను బతికుండగా డంపింగ్ యార్డ్ పెట్టనివ్వను : ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి
