అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Prajapalana Pragathi Pranalika | జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో (Nizamabad police) తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ కొనసాగుతోంది. దీంట్లో భాగంగా పోలీస్శాఖ పరంగా ఈ కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లపై సీపీ సాయిచైతన్య (Sai Chaitanya CP) మంగళవారం వీసీ నిర్వహించారు.
Prajapalana Pragathi Pranalika | పోలీసు సిబ్బందికి సూచనలు, సలహాలు..
99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పోలీస్ సిబ్బందికి సీపీ పలు సూచనలు సలహాలు అందజేశారు. మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12వరకు జరిగే 99 రోజుల ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని అన్నారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ అధికారులతో వీసీలో మాట్లాడారు.
Prajapalana Pragathi Pranalika | ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం..
సిబ్బంది కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో (Telangana police news) గ్రామాలను సందర్శించాలని సీపీ సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో పెట్టుబడులను ఆకర్షించడానికి సర్వతోముఖాభివృద్ధికి శాంతిభద్రతలు (Telangana governance) కీలకమన్నారు. వీటిని కఠినంగా అమలు చేయాలని సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్లలో 5ఎస్ విధానం అమలు, రికార్డుల (Nizamabad crime news) అనుసంధానం, వాహనాల పార్కింగ్ వ్యవస్థ, పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ సెంటరు మొదలగునవి క్షుణ్ణంగా అమలు చేయాలని ఆయన సూచించారు. వీసీలో నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కె.శ్రీధర్ రెడ్డి, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ అంజయ్య, ఐటీ సెల్ సిబ్బంది కమ్యూనికేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Nareddy Mohan Reddy | రోడ్డు ప్రమాదంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు మృతి

