అక్షరటుడే, ఇందూరు: కాకతీయ ఒలంపియాడ్ స్కూల్ ఆధ్వర్యంలో ప్రీప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే (Pre Primary Graduation Day) నిర్వహించారు. నగరంలోని కేవోఎస్ ప్రగతినగర్లో ఈ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Pre Primary Graduation Day | స్కూల్ స్థాయిలోనే ఆధునిక విద్య అవసరం
ఈ సందర్భంగా కేవోఎస్ డైరెక్టర్ సీహెచ్ తేజస్విని మాట్లాడుతూ.. ఆధునిక విద్యా విధానంలో అన్నివిధాల డెవలప్మెంట్ ఉంటేనే జాతీయస్థాయి పోటీ పరీక్షలైన ఐఐటీ మెడికల్లో రాణించగలుగుతారని తెలిపారు. స్కూల్ స్థాయి నుంచే పిల్లలు పిల్లలకు అన్ని విధాల ముందుండేలా రెగ్యులర్ విద్యతో పాటు నిజమైన ఐఐటీ మెడికల్ ఫౌండేషన్ ఇంటర్మీడియట్/ఎంసెట్ కోసం నిష్ణాతులతో ట్రైనింగ్ ఇప్పిస్తున్నామన్నారు. అలాగే స్ట్రెస్ రిలీఫ్, ఫిజికల్ స్ట్రెంత్ కోసం గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో పిల్లలు చురుకుగా పాల్గొనేలా స్పెషల్ కోచ్ పర్యవేక్షణ ఉంటుందన్నారు. అలాగే మెంటల్ స్ట్రెంత్ కోసం రోబోటిక్స్, ఒలంపియాడ్ ఎగ్జామ్స్ కాంపిటీషన్స్ ద్వారా విద్యార్థులు ఆల్ రౌండ్ డెవలప్ మెంట్ అవుతారని వివరించారు.

Pre Primary Graduation Day | లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి..
కేవోస్ డైరెక్టర్ సీహెచ్ రామోజీరావు మాట్లాడుతూ తాము చేపడుతున్న ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల్లో లీడర్ షిప్ క్వాలిటీస్ పెరుగుతాయని తెలిపారు. రెగ్యులర్ విద్యతోపాటు ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్ కోసం ఎంసెట్ స్థాయి లెక్చరర్స్తో బోధన చేయిస్తున్నామన్నారు. విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉండేందుకు ఇంటర్నల్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నామని వివరించారు. అలాగే శారీరక దృఢత్వం కోసం స్పోర్ట్స్ కోచ్ల ద్వారా ఇంటర్నల్ గేమ్స్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా టెక్నికల్గా రాణించడం కోసం రోబోటిక్స్, ఏఐ బేస్డ్ కాంపిటీషన్స్, ఐఐటీ బేస్డ్ ఒలంపియాడ్ ఎగ్జామ్స్, ఇలా ఎన్నో విషయాల్లో విద్యార్థులకు విద్యనందిస్తూ మందుకు సాగుతున్నామని చెప్పారు. ఇలాంటి అన్ని కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో లీడర్షిప్ క్వాలిటీస్ పెరిగి.. సమాజంలో గొప్ప వ్యక్తిగా ఎదిగే అవకాశం ఉంటుందన్నారు.

ఐఐటీ, మెడికల్లో విజయానికి స్కూల్ విద్యే పునాది
జాతీయస్థాయి పరీక్షలైన ఐఐటీ, మెడికల్లో విద్యార్థుల విజయానికి స్కూల్ విద్యే పునాది అవుతుందని కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ రజనీకాంత్ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు నూతన విద్యా విధానంలో భాగంగా జాతీయ దృక్పథంతో ఆలోచించాలని సూచించారు. స్కూల్ స్థాయిలోనే ఉత్తమ విద్య అందించాలన్నారు. నిర్ణయం మీదైతే భవిష్యత్తు మీ పిల్లలది అవుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతి ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ ప్రదానోత్సవం నిర్వహిచారు. కార్యక్రమంలో నాలుగోటౌన్ ఎస్సై సందీప్, కాకతీయ విద్యాసంస్థల చైర్పర్సన్ సీహెచ్ విజయలక్ష్మి, కాకతీయ డైరెక్టర్ సీహెచ్ రాజా, ప్రిన్సిపాళ్లు నటరాజ్, కేవోఎస్ అకాడమీక్ కో–ఆర్డినేటర్స్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


ఇది కూడా చదవండి..: Olympiad Education Benefits | ఒలంపియాడ్ విద్యతో ఉజ్వల భవిష్యత్తు..
