అక్షరటుడే, లింగంపేట: PRTU Ravinder Sharma | కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బ్రెయిన్ స్ట్రోక్తో పీఆర్టీయూ లింగంపల్లి మండల అధ్యక్షుడు రవీందర్ శర్మ మరణించారు. లింగంపల్లి కుర్దు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా ఉన్న రవీందర్ శర్మ గురువారం రాత్రి బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందారు.
PRTU Ravinder Sharma | పీఆర్టీయూ భీష్మ పితామహుడు
లింగంపేట మండలంలో పీఆర్టీయూ PRTU సంఘానికి భీష్మ పితామహుడుగా రవీందర్ శర్మ పేరుపొందారు. ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలు వచ్చినా తనదైన శైలితో ముందుకు వచ్చి పరిష్కరించేవారు. 37 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ అందరి చేత మన్నలను పొందారు.
| పురోహితంలో తనదైన శైలి
రవీందర్ శర్మ పురోహిత్యంలోనూ తనదైన శైలి చూపారు. ఎన్నో పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిపించారు. లింగంపేట మండల కేంద్రానికి చెందిన రవీందర్ శర్మ అందరికీ సుపరిచితుడు. ఆయన మరణంతో లింగంపేట్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇది కూడా చదవండి: Ramakrishnan Case | మైనర్ అక్కాచెల్లెళ్లపై దారుణం.. జ్యోతిష్కుడికి 200 ఏళ్ల జైలు శిక్ష

